RCB vs CSK: చివరి బంతి వరకు అదిరిపోయే థ్రిల్లర్.. ప్లేఆఫ్స్‌కు RCB వచ్చినట్లే..

చెన్నై సూపర్ కింగ్స్‌పై సంచలన విజయంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఐపీఎల్ 2025 ప్లేఆఫ్స్‌కి గేటు దాటింది. బౌలర్లు చివరి ఓవర్లలో శక్తిమేర ప్రయత్నించగా, బెంగళూరు గెలుపు కోసం అట్టుడికిన ఆటను రెండు పరుగుల తేడాతో కాపాడుకుంది. 214 పరుగుల భారీ లక్ష్యాన్ని చేధించేందుకు వచ్చిన చెన్నై, చివరి ఓవర్లో వరుసగా బౌండరీలు కొడుతూ ఉత్కంఠ రేపినా, చివరి బంతిని ఫినిష్ చేయలేక ఓటమి చవిచూసింది.

ఈ మ్యాచ్‌ లో చెన్నై తరఫున యువ ఆటగాడు ఆయుష్ మాత్రే (94) ధాటిగా ఆడి, జడేజా (77 నాటౌట్) తో కలిసి ఆర్సీబీ అభిమానుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించాడు. కానీ మిగతా బ్యాటర్లు తీవ్రంగా విఫలమవడంతో చివరకు ఆ జట్టుకు గెలుపు దూరంగా నిలిచింది. ధోనీ, కరణ్, బ్రెవిస్ లాంటి కీలక ఆటగాళ్ల ప్రదర్శన ఆశించిన స్థాయిలో లేకపోవడం చెన్నై మోకాలాడే కారణం అయ్యింది.

ఇదే సమయంలో, మొదట బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ బ్యాటింగ్‌లో భారీ ఊపు కనిపించింది. కోహ్లీ (62) మరోసారి తన క్లాస్‌ను చూపించగా, బెతెల్ (55) దూకుడుగా ఆడాడు. కానీ అసలైన షో స్టాపర్ రొమారియో షెఫర్డ్. కేవలం 14 బంతుల్లోనే 53 పరుగులు చేసి చెన్నై బౌలర్లపై విరుచుకుపడ్డాడు. అతని అగ్రీసివ్ హిట్టింగ్‌తోనే బెంగళూరు స్కోరు 213 వద్ద ఆగింది. చెన్నై బౌలర్లలో పతిరన మాత్రమే ప్రభావం చూపగలిగాడు.

ఈ గెలుపుతో ఆర్సీబీ పాయింట్ల పట్టికలో (16) అగ్రస్థానంలో నిలిచి ప్లేఆఫ్స్ బెర్తును దాదాపుగా ఖాయం చేసుకుంది. చివరి మ్యాచ్‌లో ధోనీ కెప్టెన్సీలో సీఎస్‌కే ఓడిపోవడంతో అభిమానుల్లో నిరాశ నెలకొంది. కానీ బెంగళూరు మాత్రం గత కొన్ని సీజన్లలో కనపడని కాన్ఫిడెన్స్‌తో దూసుకుపోతోంది. ఈసారి ట్రోఫీ గెలిచే టీమ్‌లలో ఆర్సీబీ పేరును ఖచ్చితంగా లెక్కలో పెట్టాల్సిందే.

మోడీ మాటలలో మోసం || Analyst Ks Prasad Reacts On PM Modi Relaunches Capital Amaravati || TR