ఇండస్ట్రీ టాక్ : సెన్సేషనల్ డైరెక్టర్ తో మెగాస్టార్ క్రేజీ ప్రాజెక్ట్.!

తెలుగు సినిమా దిగ్గజ హీరో మెగాస్టార్ చిరంజీవి హీరోగా అయితే ఇప్పుడు తన రేంజ్ సినిమాలు చేయడం లేదు అనే మాట చాలా వాస్తవం. ఫ్యాన్స్ కూడా ఇప్పటికీ మెగాస్టార్ రీమేక్ సినిమాలు పై ఆధారపడుతూ ఉండడం మెగాస్టార్ తన మార్కెట్ ని తానే దెబ్బ తీసుకుంటున్నారని వాపోతున్నారు.

అయితే మరి మెగాస్టార్ తన రేంజ్ సినిమా అందులోని కొత్త సబ్జెక్టు చేస్తే ఎలా ఉంటుందో రీసెంట్ గా వాల్తేరు వీరయ్య అయితే చూపించింది. అయితే ఇప్పుడు మెగాస్టార్ మరికాస్త రూట్ మార్చి ఓ సెన్సేషనల్ సబ్జెక్టు ని అయితే ప్లాన్ చేస్తున్నట్టుగా రూమర్స్ వినిపిస్తున్నాయి.

రీసెంట్ గా మలయాళ సినిమా దగ్గర వచ్చి బిగ్గెస్ట్ హిట్ అయిన సినిమా “2018” సక్సెస్ కోసం తెలుగు ఆడియెన్స్ కి కూడా ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మరి ఈ సినిమా దర్శకుడు జూడే ఆంథోనీ జోసెఫ్ తో అయితే మెగాస్టార్ ఓ ఇంట్రెస్టింగ్ సబ్జెక్టు ని చేస్తున్నట్టుగా రూమర్స్ ఇపుడు గట్టిగా తెలుగు సినిమా వర్గాల్లో వైరల్ అవుతున్నాయి.

అలాగే మళ్ళీ ఈ చిత్రం అయితే వైజాగ్ బ్యాక్ డ్రాప్ లోనే ఉంటుంది అని మరో అంశం. దీనితో ఈ ఊహించని కాంబినేషన్ ఒక్కసారిగా క్రేజీ హైప్ ని తీసుకొచ్చింది. మెగా ఫ్యాన్స్ కూడా ఇలాంటి కాంబినేషన్ లే ఆశిస్తున్నారు కాబట్టి ఈ చిత్రం ఓకే అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ బిజినెస్ చేసుకుంటుంది అని చెప్పడంలో సందేహమే లేదు. ఇప్పుడు అయితే మెగాస్టార్ భోళా శంకర్ అనే ఓ రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే.