ఇండస్ట్రీ టాక్ : రజినీ ఆల్రెడీ చేసిన కథతోనే ధనుష్??

తమిళ సినిమా నాట మంచి క్రేజ్ ఉన్న స్టార్ హీరోస్ లో ధనుష్ కూడా ఒకడు. కాగా ఇపుడు ధనుష్ వరుసగా తమిళ్, తెలుగు దర్శకులతో వర్క్ చేస్తూ మంచి హిట్స్ అందుకుంటున్నాడు. రీసెంట్ గా తన నుంచి వచ్చిన భారీ సినిమా “కెప్టెన్ మిల్లర్” మంచి వసూళ్లనే సాధించింది.

కాగా మరో పక్క తన 50వ సినిమాని కూడా తాను కంప్లీట్ చెయ్యగా ఈ సినిమా అనంతరం మన టాలీవుడ్ దర్శకుడు శేఖర్ కమ్ముల సినిమా స్టార్ట్ చేసాడు. కాగా ఇది ధనుష్ 51వ సినిమాగా ప్లాన్ చేస్తుండగా ఇందులో అక్కినేని నాగార్జున కూడా నటిస్తున్నారు. అయితే ఈ చిత్రం నేపథ్యం విషయంలో కొన్ని రూమర్స్ ఇపుడు సినీ వర్గాలలో వినిపిస్తున్నాయి.

దీనితో ఈ చిత్రం కథ నేపథ్యం ముంబై లో ధారావి అనే ప్రాంతంలో ఉంటుంది అని వినిపిస్తుంది. అయితే ఇది బాగా వింటే ఇదే నేపథ్యంలో సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన గండ్ స్టర్ డ్రామా “కాలా” సినిమా గుర్తుకు రావచ్చు. దర్శకుడు పా రంజిత్ తెరకెక్కించిన ఈ చిత్రం కూడా అణగారిన కులాల కోసం ముంబై ధారావి ప్రాంతంలోనే కనిపిస్తుంది అలాగే అందులో రజినీకాంత్ డాన్ తరహా పాత్రలో కనిపించారు.

కానీ ఇక్కడ నాగార్జున డాన్ గా కనిపిస్తాడని సినీ వర్గాల్లో గాసిప్స్ వినిపిస్తున్నాయి. దీనితో తన మాజీ మామ సూపర్ స్టార్ రజినీకాంత్ కథ తోనే ధనుష్ వస్తున్నాడని చెప్పాల్సిందే. మరి ఈ సినిమా కథ కూడా ఇలానే ఉంటుందా లేదా అనేది చూడాలి. ఇంకో పక్క కాలా చిత్ర దర్శకుడు చేస్తున్న తంగళాన్ సినిమా “కేజీఎఫ్” బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతూ ఉండడం గమనార్హం.