బిగ్ బాస్ 4 : ఈ వారం ఎలిమినేషన్ లో నమ్మలేని షాక్ ఇవ్వబోతున్న నాగార్జున

In first week to contestants are eliminated in bigg boss 4

బిగ్ బాస్ 4 సీజన్ ప్రారంభమయి అప్పటికే ఐదు రోజులు అయింది. షో కూడా మాంచి జోరుమీదుంది. ఇప్పటికే బిగ్ బాస్ హౌస్ లో గొడవలు స్టార్ట్ అయ్యాయి. ఒకరినొకరు తిట్టుకునుడు అయింది. కొందరు ఫ్రెండ్స్ అయ్యారు. మరికొందరు శత్రువులు అయ్యారు. గ్రూపులు కూడా స్టార్ట్ అయ్యాయి.

In first week to contestants are eliminated in bigg boss 4
In first week to contestants are eliminated in bigg boss 4

ఇక.. సీక్రెట్ రూం నుంచి వచ్చిన ఆరియానా గ్లోరీ, సయ్యద్ సోహైల్ ను అయితే ఇంటి సభ్యులు శత్రువుల్లా చూస్తున్నారు. వాళ్లు ఏం మాట్లాడినా అది టాస్కేమో అని అనుమానిస్తున్నారు. ముఖ్యంగా ఇంటి సభ్యుల్లో నోయల్ ప్రవర్తన మాత్రం చాలా ఓవర్ గా ఉంటోంది. ప్రతి దాన్ని ఏదో పెద్దదిగా ఆలోచించడం.. ఓవర్ గా రియాక్ట్ అవడం చేస్తున్నాడు నోయల్. అయితే.. బిగ్ బాస్ నోయల్ కు కూడా ఒక టాస్క్ ఇచ్చాడని.. నోయలే కట్టప్ప అని కూడా అంటున్నారు. అందుకే.. నోయల్ ప్రతి విషయంలో ఇన్వాల్వ్ అవుతూ… మిగితా కంటెస్టెంట్లను డిస్టర్బ్ చేస్తున్నాడు అని తెలుస్తోంది.

మరో కంటెస్టెంట్ దివి మాత్రం ఒక్కసారిగా తన మీద ఉన్న బ్యాడ్ ఒపినియన్ ను సాఫ్ట్ కార్నర్ గా మార్చేసుకుంది. హౌస్ లోకి వచ్చిన మూడు రోజుల వరకు ఎవ్వరితోనూ ఎక్కువగా మాట్లాడని దివి.. తర్వాత ఒక్కొక్కరి ప్రవర్తన గురించి ముఖం మీదే చెప్పడంతో తన మెచ్యురిటీ లేవల్స్ అందరికీ అర్ధం అయ్యాయి. దీంతో దివిని అందరూ ప్రత్యేకంగా చూడటం మొదలు పెట్టారు.

ఇక.. ఈ వారం ఎలిమినేషన్ కోసం ఏడుగురు కంటెస్టెంట్లు సిద్ధంగా ఉన్నారు. దివి, గంగవ్వ, సుజాత, సూర్య కిరణ్, అభిజిత్, అఖిల్, మెహబూబ్ నామినేషన్ లో ఉన్నారు. వీళ్లలో ఎవరో ఒకరు బయటికి వెళ్లాల్సి ఉంది. కానీ.. ఈ సారి ఇద్దరిని ఎలిమినేట్ చేద్దామని బిగ్ బాస్ యాజమాన్యం ఆలోచిస్తోందట. ఎందుకంటే.. ఈసారి కంటెస్టెంట్లు కాస్త వీక్ గా ఉన్నారని ఇప్పటికే టాక్ వినిపిస్తోంది. అందులోనూ హౌస్ లోకి వెళ్లాక కంటెస్టెంట్ల నుంచి అంతగా వినోదం కూడా రావట్లేదు. దీంతో ఇద్దరిని ఎలిమినేట్ చేసి.. మరో ఇద్దరిని వచ్చే వారం వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా హౌస్ లోకి పంపించేందుకు బిగ్ బాస్ నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నారు.

ఇద్దరిని ఎలిమినేట్ చేసి.. స్వాతి దీక్షిత్, జబర్దస్త్ ముక్కు అవినాశ్, ఈరోజుల్లో ఫేం శశికుమార్ ను వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా బిగ్ బాస్ హౌస్ లోకి పంపిస్తారట. ముందుగా ఇద్దరిని.. ఆ తర్వాత మరొకరిని పంపించనున్నట్టు సమాచారం. ఇప్పటికే ఈ ముగ్గురు క్వారంటైన్ లో ఉన్నట్టు సమాచారం.

అయితే.. ఈ సారి హౌస్ నుంచి బయటికి వెళ్లే ఆ ఇద్దరు ఎవరు? అనేదే ప్రస్తుతం సస్పెన్స్ గా మారింది. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం ప్రకారం… సూర్య కిరణ్, మెహబూబ్, అఖిల్.. ఈ ముగ్గురిలో ఇద్దరు బయటికి వెళ్లే అవకాశం ఉందని చెబుతున్నారు.