Mahesh Babu : హిందీ ప్రేక్షకులకోసం హిందీ సినిమా ఎందుకు.? గట్టిగా కౌంటర్ ఇచ్చిన సూపర్ స్టార్…!

Mahesh Babu : సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శకుడు పరశురామ్ తో తీస్తున్న సినిమా సర్కారు వారి పాట. భరత్ అను నేను, మహర్షి, సరిలేరు నీకెవ్వరు వంటి హ్యాట్రిక్ విజయం తర్వాత వస్తున్న స్టార్ సినిమా సర్కారు వారి పాట. ఈ సినిమా మీద అభిమానుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమా నుంచి వచ్చిన ఫస్ట్ లుక్, టీజర్ కు విశేష స్పందన లభించింది. ఇక సినిమా నుంచి వచ్చిన కళావతి సాంగ్ యూట్యూబ్ లో 12 కోట్ల వ్యూస్ తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే.

ఇక ఈ మధ్య సీతార తో చేసిన ‘పెన్నీ’ సాంగ్ మ్యూజిక్ వీడియో అయితే పెద్ద సెన్సేషనల్ గా మారింది.అయితే తాజాగా ఉగాది పండుగ సందర్భంగా చిత్ర బృందం సినిమా కి సంబంధించిన పోస్టర్ని ఆవిష్కరించారు.దీనికి కూడా అబుమానుల నుంచి మంచి స్పందన వస్తోంది.మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్, మహేష్ బాబు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.ఐతే తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న మహేశ్‌ ఓ జర్నలిస్ట్‌ అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌ చేశారు.

ప్రస్తుతం అందరూ స్టార్‌ హీరోలు హిందీ సినిమాలు చేస్తున్నారు. మరి మీరెప్పుడు డైరెక్ట్‌ హిందీ సినిమా చేస్తున్నారు? అని జర్నలిస్ట్‌ అడగ్గా.. ‘బాలీవుడ్ జనాలను మెప్పించాలంటే హిందీలో సినిమా చేయాల్సిన అవసరం లేదు. తెలుగులో సినిమాలు తీసినా చాలు. ఇప్పుడు తెలుగు చిత్రాలను ప్రపంచమంతా చూస్తున్నారు. ప్రస్తుతం జరుగుతోంది అదే.అలాంటప్పుడు నువ్వైనా సరే తెలుగు సినిమాలు చేస్తే చాలనుకుంటావు అంటూ తనదైన పంచ్‌ డైలాగ్‌తో ఆన్సరిచ్చాడు.తాజాగా జాన్ అబ్రహం తాను హిందీలో తప్ప మరే ఇతర భాషల్లో నటించనంటూ సెన్సేషనల్‌ కామెంట్స్‌ చేసిన సంగతి తెలిసిందే.ఇలాటి వాళ్లకి సైలెంట్ గా మహేష్ తనదిన స్టైల్ లో చురకలు ఆంటీచారు అని అనుకుంటున్నారు.దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతుంది.