ఇప్పటికీ చెక్కు చెదరని అందం ..ఆ రెండు సినిమాలు రిలీజైతే వాళ్ళంతా ఔటే ..?

ఎవరే అతగాడు సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకి పరిచయమైంది ప్రియమణి. ఈ సినిమా అంతగా సక్సస్ కానప్పటికి పెళ్ళైన కొత్తలో సినిమాతో మంచి హిట్ అందుకుంది. ఆ తర్వాత టాలీవుడ్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించింది. తమిళంలో నటించిన పరుత్తి వీరన్ సినిమాకి నేషనల్ అవార్డు సాధించుకున్న ప్రియమణి ఇండస్ట్రీలో ప్రముఖుల ప్రశంసలు దక్కించుకుంది. రాజమౌళి – ఎన్టీఆర్ కాంబినేషన్ లో వచ్చిన యమదొంగ సినిమాలో నటించిన ప్రియమణి నితిన్, గోపిచంద్, బాలకృష్ణ లాంటి స్టార్ హీరోలతో నటించి సక్సస్ లను సొంతం చేసుకుంది.

విక్టరీ వెంకటేష్ నారప్పలో సుందరమ్మ గా ప్రియమణి... — తెలుగు పోస్ట్

అయితే పెళ్ళి చేసుకున్న ప్రియమణి కొంతకాలంగా సినిమాలకి దూరంగా ఉంది. ఒకవైపు ఢీ షోకి జడ్జ్ గా వ్యవహరిస్తూ మళ్ళీ ఇప్పుడు తెలుగులో వరసగా సినిమాలు చేస్తూ సెకండ్ ఇన్నింగ్స్ ని మొదలు పెట్టింది. ప్రముఖ నిర్మాత సురేష్ బాబు నిర్మాణంలో రూపొందుతున్న రెండు సినిమాలు చేస్తోంది. అయితే ప్రియమణి గ్లామర్ ఇప్పుడు అందరికీ షాకిస్తోంది. ఇండస్ట్రీకొచ్చి ఇన్నెళ్ళైనా కూడా తనలోని గ్లామర్ రెట్టింపు అవుతుందే తప్ప ఏమాత్రం తగ్గడం లేదు. అందుకే అందరు ప్రియమణి నటిస్తున్న రెండు సినిమాలు రిలీజైతే ఒకమోస్తారు హీరోయిన్స్ అందరికి చెక్ పెట్టినట్టే వాళ్ళ అవకాశాలన్ని ప్రియమణి సొంతం చేసుకుంటుందని చెప్పుకుంటున్నారు.

Priyamani's first-look as Comrade Bharathakka from Virata Parvam released |  Telugu Movie News - Times of India

తమిళ అసురన్ రీమేక్ నారప్ప లో వెంకటేష్ సరసన నటిస్తున్న ప్రియమణి..అలాగే రానా నటిస్తున్న విరాటపర్వం లో కూడా నటిస్తుంది. సాయి పల్లవి మరో హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా కి వేణు ఉడుగుల దర్శకత్వం వహిస్తున్నాడు. సురేష్ ప్రొడక్షన్స్, శ్రీ లక్ష్మీ వెంకటేశర్య క్రియేషన్స్ నిర్మిస్తున్నారు. 1992 ల నాటి పీరియడిక్ డ్రామాగా విరాటపర్వం తెరకెక్కుతుంది. కాగా వెంకటేష్ నారప్ప త్వరలో మళ్ళీ సెట్స్ మీదకి రాబోతుంది. అలాగే రానా విరాట పర్వం కూడా డిసెంబర్ వరకు పూర్తి కాబోతుందని సమాచారం.