మహేష్ బాబు ఆ మాట అంటారని అనుకోలేదు… ఆస్తులు కూడా అమ్మేశాము: సుమంత్ అశ్విన్

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎన్నో నిర్మాణ సంస్థలు ఉన్నాయి. అయితే ఒకప్పుడు ఎన్నో సూపర్ హిట్ సినిమాలను నిర్మించిన సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్ అనగానే ఒక్కడు, వర్షం, నువ్వొస్తానంటే నేనొద్దంటానా వంటి ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాలు ప్రేక్షకులకు గుర్తొస్తాయి. సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్ ద్వారా నిర్మాత ఎమ్మెస్ రాజు ఎన్నో అద్భుతమైన సినిమాలను ప్రేక్షకులకు పరిచయం చేశారు.ఇక ఈయన కుమారుడిగా సుమంత్ అశ్విన్ ఇండస్ట్రీలోకి వచ్చినప్పటికీ ఈయన మాత్రం పెద్దగా సక్సెస్ కాలేకపోయారని చెప్పాలి.

సుమంత్ అశ్విన్ సైతం తూనీగ తూనీగ కేరింత వంటి ఎన్నో సినిమాలలో నటించిన ఈయనకు పెద్దగా గుర్తింపు రాలేదు.ఇకపోతే ఎమ్మెస్ రాజు నిర్మాణంలో నటించిన ఎంతోమంది స్టార్ హీరోలు ఈయన సినిమాలకు కాస్త ప్రమోట్ చేసి ఉంటే ఈయన కూడా ఇండస్ట్రీలో మంచి సక్సెస్ సాధించేవారని చెప్పాలి అయితే ఈ విషయం గురించి కూడా సుమంత్ ఒక సందర్భంలో మాట్లాడుతూ పలు విషయాలను తెలియజేశారు.

ఈ సందర్భంగా సుమంత్ అశ్విన్ మాట్లాడుతూ ఎప్పుడు పని చేయకపోయినా ఆయన తమ సినిమా ప్రమోషన్ల కోసం వచ్చారని సుమంత్ అశ్విన్ వెల్లడించారు.ఆ తర్వాత సీనియర్ హీరో వెంకటేష్ సైతం పిలిచిన వెంటనే సినిమా ప్రమోషన్లకు వచ్చారని ఈయన తెలియజేశారు.ఇక మహేష్ బాబు సైతం ఓ సినిమా ప్రమోషన్ కోసం ఆహ్వానించగా తాను యూరప్ ట్రిప్ లో ఉన్నానని చెప్పారు. అయితే మహేష్ బాబు అలా చెబుతారని అనుకోలేదు అంటూ సుమంత్ అశ్విన్ వెల్లడించారు. ఒకప్పుడు వరుస బ్లాక్ బాస్టర్ సినిమాలను చేసినటువంటి ఎమ్మెస్ రాజు కొన్నిసార్లు తన జడ్జిమెంట్ తప్పు కావడంతో భారీగా నష్టాలు ఎదుర్కొన్నారు ఇలా కొన్ని సినిమాల వల్ల నష్టాలు రావడంతో ఆ నష్టాలను పూడ్చడానికి చెన్నైలో ఉన్నటువంటి ఆస్తులు కూడా అమ్ముకున్నామని ఈయన తెలిపారు.