తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సమంత!

తిరుమల శ్రీవారిని, తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ సమంత దర్శించుకుంది. సోమవారం ఉదయం ఆలయం వద్దకు చేరుకున్న సమంతకు ఆలయ అధికారులు పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారి పుష్పాంజలి సేవలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు సమంత.

ఇక అమ్మవారి దర్శనం అనంతరం సమంతకు పండితులు వేద ఆశీర్వాదం అందించారు. ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి సమంతకు అమ్మవారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు. అయితే సమంత తిరుచానూరు వచ్చిందని తెలియడంతో ఒక్కసారిగా సమంతను చూడడానికి అభిమానులు ఎగబడ్డారు. కొందరు ఆమెతో సెల్ఫీలు దిగారు. చాలారోజుల తర్వాత పద్మావతీ అమ్మవారి ఆలయానికి వచ్చిన సమంత చాలా సంతోషంగా నవ్వుతూ కనిపించారు.