ఆ హీరో  పూజా హెగ్డేనే కావాలంటున్నాడట!

టాలీవుడ్ హీరో  దగ్గుబాటి రానా కథానాయకుడిగా దర్శకుడు గుణశేఖర్ ప్లాన్ చేసిన భారీ బడ్జెట్ చిత్రం `హిరణ్య కశ్యప` ఇప్పట్లో పట్టాలెక్కదని తేలిపోయింది. ప్రస్తుత పరిస్థితులన్నీ సర్దుకున్నాకే ఆ సినిమా ఉంటుందని గుణశేఖర్ ఇటీవల ఓ సందర్భంలో  స్పష్టం చేశారు.

Pooja Hegde  

ఈ లోపు మరో ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. ప్రముఖ కవి కాళిదాసు రచన ఆధారంగా `శాకుంతలం` సినిమాను తెరకెక్కించబోతున్నారు. మణిశర్మ మ్యూజిక్‌‌తో ఇటీవల విడుదలైన ఈ సినిమా మోషన్‌ పోస్టర్‌ పలువురిని ఆకట్టుకుంటోంది. శకుంతల, దుష్యంతుడి ప్రేమకథ ఆధారంగా ఆ సినిమా తెరకెక్కబోతున్నట్టు తెలుస్తోంది.

ఈ సినిమాలో హీరోయిన్  కోసం ప్రముఖ హీరోయిన్ లు  కీర్తి సురేష్, పూజా హెగ్డే  లను గుణశేఖర్ సంప్రదించబోతున్నట్టు సమాచారం. వీళ్లలో ఎవరో ఒకరిని ఎంపిక చేసుకునే పనిలో గుణశేఖర్ ఉన్నారట. వాళ్లు  అంగీకరించకపోతే బాలీవుడ్ భామలను దించే ప్రయత్నంలో ఉన్నారట.

అయితే..  హీరో మాత్రం  పూజా హెగ్డే  వైపే మొగ్గు చూపుతున్నాడని సమాచారం. ఆమెనే కావాలని పట్టుబడుతున్నాడట. అంతగా పట్టుబట్టడంలో మతలబు ఏమిటో?! అని టాలీవుడ్ లో చర్చించుకుంటున్నారట.