అఖిల్ కి జంటగా రష్మిక ని తీసుకోమని చెప్పింది ఆయనే అయితే ఎవరు మాట మాట్లాడాల్సిన పనిలేదు ..!

ప్రస్తుతం అఖిల్ అక్కినేని హీరోగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో నటిస్తున్న సినిమా ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’. ఈ సినిమాలో టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ పూజా హెగ్డే అఖిల్ కి జంటగా నటిస్తుంది. ‘గీతా ఆర్ట్స్’ బ్యానర్ పై అల్లు అరవింద్ సమరణలో బన్ని వాసు, వాసు వర్మ కలిసి నిర్మిస్తున్నారు. కాగా ఇప్పటికే ఈ సినిమా సూపర్ హిట్ అవుతుందన్న నమ్మంతో చిత్ర యూనిట్ ఉన్నారు. నాగార్జున కూడా ఈ సినిమా రష్ చూసి సినిమా సూపర్ హిట్ అని జడ్జ్ చేసినట్టు చెబుతున్నారు.

New poster of Most Eligible Bachelor featuring Akhil Akkineni, Pooja Hegde  out - regional movies - Hindustan Times

ఈ క్రమంలో అఖిల్ 5 కి సన్నాహాలు జరుగుతున్నాయి. స్టైలిష్ డైరెక్టర్ సురేంద్ర రెడ్డి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కబోతుంది. ప్రముఖ నిర్మాణ సంస్థ ’ఏ.కె ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ పై అనిల్ సుంకర ఈ సినిమాని నిర్మించబోతున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని సమాచారం. 2021 లో ఈ సినిమాని సెట్స్ మీదకి తీసుకు వెళ్ళేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.

Rashmika Mandanna: Pogaru,Bheeshma,Sultan 2019 has been very kind to me-  Cinema express

కాగా ఈ సినిమాలో అఖిల్ కి జంటగా రష్మిక మందన్న ను తీసుకోమని స్వయంగా అఖిల్ సూచించాడని తెలుస్తుంది. ఇదే బ్యానర్ లో రష్మిక సూపర్ హిట్ సినిమా ‘సరిలేరు నీకెవ్వరు’ చేసింది. దాంతో రష్మిక ను నిర్మాత సంప్రదించగా రష్మిక మందన కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. రష్మిక హీరోయిన్ గా నటించిన సినిమాలన్ని సూపర్ హిట్ అవుతుండటంతో టాలీవుడ్ లో గోల్డెన్ లెగ్ ముద్ర పడిపోయింది. అదే సెంటిమెంట్ ని అఖిల్ తన సినిమాకి కలిసొచ్చేలా ప్లాన్ చేసినట్టు చెప్పుకుంటున్నారు.