దుమారం రేపుతున్న రజినీ కాంట్రవర్సీపై క్లారిటీ మీకోసం.!

రీసెంట్ గా సౌత్ ఇండియా సినిమా దగ్గర వచ్చిన భారీ హిట్ చిత్రం “జైలర్”  తో ఆ సినిమా స్టార్ హీరో సూపర్ స్టార్ రజినీకాంత్ అభిమానులు ఇప్పుడు సంబరాలు చేసుకుంటూ ఉండగా ఈ సంబరాలు ఎంతో కాలం ఉండవు అన్నట్టుగా రజినీకాంత్ చేసిన ఓ షాకింగ్ జెశ్చర్ ఇప్పుడు సినీ వర్గాల్లో సహా పొలిటికల్ వర్గాల్లో కూడా పెద్ద ఎత్తున దుమారం రేపుతోంది.

అయితే రజినీ జైలర్ చిత్రాన్ని చూసేందుకు ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాథ్ వచ్చారు. బాగానే ఉంది.. కానీ రజినీకాంత్ యోగి ఆదిత్య నాథ్ కాళ్ళ కి దణ్ణం పెట్టడం అనేది అందరికీ షాకిచ్చింది. అయితే 70 ఏళ్ళకి పైగా ఉన్న రజిని 60 ఏళ్ళు కూడా నిండని ఒక సీఎం కాళ్ళకి దణ్ణం పెట్టడం ఏంటి అనేది తమిళ వర్గాల్లో అయితే కాంట్రవర్సీగా మారగా..

మన తెలుగు వారిలో కూడా కొందరు మరింత ఆవేశ పడిపోతున్నారు. రజిని ఏంటి తనకన్నా చిన్నవాడి కాళ్ళ మీద పడడం ఏంటి అనేది షాకింగ్ గా మారగా అసలు దీనిపై క్లారిటీ ఏంటి అనేది తెలుస్తుంది. అక్కడ రజిని కానీ యోగి ఆదిత్య నాథ్ కానీ తమ స్టేటస్ తో మీట్ అయ్యింది కాదు అట.

అక్కడ తాను సూపర్ స్టారు కాదు ఆదిత్య నాథ్ సీఎం హోదాలో కాకుండా ఆధ్యాత్మికతను నమ్మేవాడిగా రజిని అలాగే మనదేశంలో గోరఖ్ నాథ్ మత ప్రధాన పండితునిగా యోగి ఆదిత్యనాథ్ లుగా మాత్రమే కలిశారు. దీనితో రజిని ఆధ్యాత్మికత పరంగా కళ్ళకి నమస్కారం చెప్పారు తప్ప అక్కడ వేరే ఏ ఉద్దేశం కూడా లేదు అని తెలుస్తుంది. దీనితో తలైవా ఫ్యాన్స్ ఇది తేలిక కంగారు పడుతున్నారు అని సినీ విశ్లేషకులు అంటున్నారు.