“జైలర్” : రజినీకి ఇప్పుడు అందిన పారితోషకం.. 

ఈ ఏడాది సౌత్ ఇండియా బాక్సాఫీస్ దగ్గర భారీ అంచనాలు నడుమ రిలీజ్ కి వచ్చి పెద్ద హిట్ అయ్యిన చిత్రం “జైలర్” కోసం అందరికీ తెలిసిందే. మరి తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా తమన్నా హీరోయిన్ గా నటించిన ఈ సినిమా రజిని కెరీర్ లోనే మరో పెద్ద హిట్ అయ్యింది.

అయితే ఈ సినిమా రిలీజ్ అయ్యి మూడు వారాలు కావస్తున్నా ఇంకా హవా కొనసాగిస్తుంది. అయితే ఈ సినిమాకి రజినీకాంత్ అప్పట్లోనే 100 కోట్లకి పైగా రెమ్యునరేష ని తీసుకున్నారని పలు రూమర్స్ వినిపించాయి. కానీ అసలు రజినీకి రెమ్యునరేషన్ ఎంత అనేది ఇప్పుడు క్లియర్ కట్ గా అయితే తెలిసింది.

రజిని ఈ సినిమాకి ఎలాంటి రెమ్యునరేషన్ తీసుకోలేదు. కానీ ఇప్పుడు సన్ నెట్వర్క్స్ వారు అయితే రజినీకాంత్ కి తమకి జైలర్ సినిమా మూలాన వచ్చిన లాభాల్లో అయితే మొత్తం 90 కోట్ల రూపాయల్ని అందించారు. కాగా ఈ మొత్తని అయితే చెక్ రూపంలో తలైవా కి అందించగా ఇప్పుడు ఇది వైరల్ గా మారింది.

దీనితో జైలర్ విషయంలో అందరికీ ఒక క్లారిటీ వచ్చినట్టు అనుకోవచ్చు. ఇంకా ఈ సినిమాలో మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ కన్నడ నుంచి నమ్మ శివన్న శివ రాజ్ కుమార్ పవర్ ఫుల్ గెస్ట్ పత్రాలు చేశారు. అలాగే ఇక అనిరుద్ సంగీతం కోసం అయితే ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.