ప్రభాస్ 21 కి భారీ రెమ్యూనరేషన్స్.. అమితాబ్ కే అంతైతే దీపిక పదుకొణె కి ఎంతుంటుంది..?

మహానటి లాంటి సెన్షేషనల్ సక్సస్ తర్వాత నాగ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎవరితో చేస్తాడా.. ఎవరి బయోపిక్ తీస్తాడా అని అందరూ ఆసక్తికరంగా మాట్లాడుకున్నారు. ఒక దశలో నాగ్ అశ్విన్ మెగాస్టార్ తో సినిమా తీయబోతున్నట్టు వార్తలు వచ్చాయి. మెగాస్టార్ కూడా మహానటి సినిమా చూసి నాగ్ అశ్విన్ అని అభినందిస్తూ మంచి కథ సిద్దం చేస్తే ఇద్దరం కలిసి సినిమా చేద్దామని మాటిచ్చారట. దాంతో నెక్స్ట్ సినిమా ఈ కాంబినేషన్ లోనే అని ప్రచారం జరిగింది. కాని అందరి ఆలోచనలకి భిన్నంగా నాగ్ అశ్విన్ తన నెక్స్ట్ సినిమాని ప్రకటించాడు.

Theme plot of Prabhas – Nag Ashwin project revealed - tollywood

డార్లింగ్ ప్రభాస్ తో నాగ్ అశ్విన్ తన నెక్స్ట్ సినిమాని ఇప్పటికే అనౌన్స్ చేయగా ఈ సినిమా త్వరలోనే మొదలుకానుంది. వైజయంతీ మూవీస్ బ్యానర్ లో ఈ సినిమా ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కబోతుంది. ఇప్పటికే ఈ సినిమాకి దాదాపు 500 కోట్ల వరకు బడ్జెట్ కేటాయించినట్టు వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా ఈ నిర్మాణ సంస్థ కి 50 వ సినిమా కావడంతో నిర్మాత అశ్వనీ దత్ ఏమాత్రం కాంప్రమైజ్ కాకూడదని డిసైడయ్యాడట.

Breaking: Prabhas' 21st film Announced

అశ్వనీ దత్ సమర్పణలో ఆయన కుమార్తెలు స్వప్న దత్, ప్రియాంక దత్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక కరోనా మహామ్మారి లేకుండా ఉంటే ఈ సినిమా ఇప్పటికే మొదలుకావాల్సింది. అయితే ప్రస్తుతం ప్రభాస్ చేస్తున్న ‘రాధేశ్యామ్’ పూర్తయ్యాక ఈ సినిమాని మొదలు పెడతారని సమాచారం. అయితే ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. అదే ఈ సినిమాలో నటించే యాక్టర్స్ కి భారీ స్థాయిలో రెమ్యూనరేషన్ ఇస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. ఇటీవలే నాగ్ అశ్విన్ సినిమాలో బిగ్ బి అమితాబ్ బచ్చన్ ఒక ముఖ్య పాత్ర చేయనున్నట్టు ప్రకటించారు.

ఇందుకు గాను అమితాబ్ 25 కోట్ల రెమ్యునరేషన్ ఆఫర్ చేసినట్టు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అయితే ఇంత భారీ స్థాయిలో రెమ్యూనరేషన్ ఆఫర్ చేయడానికి కారణం బాలీవుడ్ లో అమితాబ్ మార్కెట్ తో పాటు ఈ సినిమాలో అమితాబ్ ది ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్ అని తెలుస్తుంది. భారీ పాన్ ఇండియన్ సినిమా కాబట్టే ఆ రేంజ్ రెమ్యూనరేషన్ ఆఫర్ చేశారట. దాంతో ఇప్పుడు అందరూ ప్రభాస్ రెమ్యూనరేషన్ తో పాటు దీపక పదుకొణె రెమ్యూనరేషన్ ఏ రేంజ్ లో ఉంటాయో అని టాక్ మొదలైంది.