రూ.250 కోట్ల క్లబ్‌లో ‘హనుమాన్‌’

టాలీవుడ్‌ డైరెక్టర్‌ ప్రశాంత్‌ వర్మ దర్శకత్వంలో వచ్చిన తాజా చిత్రం ‘హనుమాన్‌’. భారతీయ ఇతిహాసాల్లోని హనుమంతుని కథ స్ఫూర్తితో ఇండియన్‌ తొలి ఒరిజినల్‌ సూపర్‌హీరో మూవీగా ఈ చిత్రం రాగా.. తేజ సజ్జా, అమృత అయ్యర్‌ ప్రధాన పాత్రల్లో నటించారు. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం మొదటిరోజు నుంచే పాజిటివ్‌ టాక్‌ రావడంతో బాక్సాఫీస్‌ దగ్గర కలెక్షన్ల సునామీ సృష్టిస్తుంది.

తాజాగా ఈ చిత్రం 17 రోజుల్లో వరల్డ్‌ వైడ్‌గా రూ.250 కోట్ల మార్కును అందుకుంది. ఇక రానున్న రోజుల్లో ఈ కలెక్షన్స్‌ మరింత పెరిగే అవకాశం ఉంది. ‘హనుమాన్‌’ చిత్రాన్ని ప్రైమ్‌ షో ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై కే నిరంజన్‌ రెడ్డి తెరకెక్కించగా.. కోలీవుడ్‌ భామ అమృతా అయ్యర్‌ ఫీ మేల్‌ లీడ్‌ రోల్‌లో నటించింది. వరలక్ష్మి శరత్‌ కుమార్‌, వినయ్‌ రాయ్‌, రాజ్‌ దీపక్‌ శెట్టి, వెన్నెల కిశోర్‌ కీలక పాత్రలు పోషించారు.

ఈ మూవీకి గౌరా హరి -అనుదీప్‌ దేవ్‌, కృష్ణ సౌరభ్‌ సంయుక్తంగా మ్యూజిక్‌, బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌ అందించారు. జాంబిరెడ్డి తర్వాత తేజ సజ్జా, ప్రశాంత్‌ వర్మ కాంబినేషన్‌లో వస్తున్న తొలి పాన్‌ ఇండియా సినిమా కావడంతో ఈ సినిమాను చూసేందుకు జనాలు క్యూ కడుతున్నారు.