‘గుంటూరు కారం’ సినిమా టిక్కెట్స్‌ పెంచుకోవచ్చు…

మహేష్‌ బాబు, త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ కాంబినేషన్‌ లో వస్తున్న ‘గుంటూరు కారం’ నిత్యం వార్తల్లో వుంటోంది. ఆ సినిమా ప్రీ రిలీజ్‌ వేడుక జనవరి 6న హైదరాబాదులోని యూసుఫ్‌ గూడ, పోలీసు గ్రౌండ్స్‌ లో జరగాల్సి ఉండగా, ఆ వేడుకకి పోలీసు అధికారుల అనుమతి లేకపోవటంతో రద్దు చేశారు.

ఇప్పుడు ఆ వేడుక గుంటూరులో చేపట్టారు. అలాగే ఈ సినిమాకి తెలంగాణ ప్రభుత్వం బెనిఫిట్‌ షోస్‌ కి అనుమతి ఇస్తుందా, ఇవ్వదా అనే సందేహం కూడా మహేష్‌ బాబు అభిమానుల్లో చోటుచేసుకుంది. అయితే తెలంగాణ ప్రభుత్వం ఒక జీఓ ని విడుదల చేసింది. అందులో’గుంటూరు కారం’ సినిమాకి మొదటి వారం టికెట్‌ ధరలు పెంపునకు అనుమతి ఇచ్చినట్టుగా పేర్కొంది.

మల్టీప్లెక్స్‌ లో రూ. 100 రూపాయలు, సింగిల్‌ థియేటర్స్‌ లో రూ. 65 రూపాయలు పెంచుకోవచ్చని ప్రభుత్వం అనుమతి ఇచ్చినట్టుగా ఆ జీవోలో వుంది. అలాగే ఈ సినిమా విడుదలైన అన్ని థియేటర్స్‌ లో ఒక ఉదయం 4 గంటల నుండి ఆటలు వేసుకోవచ్చు అని ప్రభుత్వం జీవోలో వివరించింది. ఈ అదనపు ఆట మొదటి వారానికి మాత్రమే వర్తిస్తుందని స్పష్టం చేసింది.