‘గుంటూరు కారం’లో మీనాక్షి లుక్‌ విడుదల

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వస్తోన్న ’గుంటూరు కారం’లో ఇద్దరు హీరోయిన్లు ఉన్నారు. అయితే… ఇప్పటి వరకు శ్రీ లీల మాత్రమే హైలైట్‌ అవుతూ వచ్చారు. ‘కుర్చీ మడతపెట్టి…’ పాట గానీ, అంతకు ముందు వచ్చిన ‘ఓ మై బేబీ’లో గానీ సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబుతో పాటు ఆమె స్టెప్పులు వేశారు.

సినిమాలో శ్రీలీలతో పాటు మరొక హీరోయిన్‌ కూడా ఉన్నారు. తాజాగా ఆమె లుక్‌ విడుదల చేశారు. రాజీ పాత్రలో ఆమె నటిస్తున్నట్లు తెలిపారు. రమణ పాత్రలో మహేష్‌ నటిస్తున్న సంగతి తెలిసిందే. రమణతో రాజీ అంటూ లుక్‌ విడుదల చేశారు. టాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు, శ్రీలీలా ప్రధాన పాత్రల్లో వస్తున్న తాజా చిత్రం ‘గుంటూరు కారం’.

టాలీవుడ్‌ స్టార్‌ డైరెక్టర్‌ త్రివిక్రమ్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ‘కుర్చీ మడతపెట్టి..’ పాట పర్‌ఫెక్ట్‌ మాస్‌ నంబర్‌గా ఆకట్టుకుంది. ఇక విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో ఈ సినిమాకు సంబంధించిన లేటెస్ట్‌ అప్‌డేట్‌ల కోసం అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే మూవీ నుంచి సాలిడ్‌ అప్‌డేట్‌ ఇచ్చారు మేకర్స్‌. తాజాగా ఈ మూవీ నుంచి మేకర్స్‌ విూనాక్షి చౌదరి ఫస్ట్‌ లుక్‌ విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో విూనాక్షి చౌదరి లంగావోణీలో ఉండగా.. మహేష్‌ భుజంపై చేతులు వేసి క్యూట్‌ లుక్‌లో కనిపిస్తుంది.