శరవేగంగా ‘గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ’ మూవీ షూటింగ్‌

కోలీవుడ్‌ స్టార్‌ హీరో అజిత్‌ కుమార్‌ తో పాన్‌ ఇండియా ప్రొడక్షన్‌ హౌస్‌ మైత్రీ మూవీ మేకర్స్‌ రూపొందిస్తున్న బిగ్గెస్ట్‌ ఎంటర్‌టైనర్‌ చిత్రం ’గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ’ ఈ తెలుగు-తమిళ ద్విభాషా చిత్రానికి అధిక్‌ రవిచంద్రన్‌ రచన, దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ హైదరాబాద్‌లో శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటోంది.

ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన లుక్‌ పోస్టర్స్‌ మంచి స్పందనను రాబట్టుకోగా, తాజాగా ఇంట్రెస్టింగ్‌ అప్డేట్‌ బయటకు వచ్చింది. అయితే.. ఈసినిమాలో ఇప్పటివరకు హీరోయిన్‌ను ఇంకా ఎంపిక చేయలేదు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ కోసం త్రిషను ఎంపిక చేశారు. ఈ మేరకు ఒప్పంద పత్రాలపై సంతకాలు కూడా పూర్తి చేశారు. త్వరలోనే అజిత్‌- త్రిష కాంబినేషన్‌లో తెరకెక్కించే సన్నివేశాలను షూట్‌ చేసేలా దర్శకుడు ఆధిక్‌ రవిచంద్రన్‌ ప్లాన్‌ చేస్తున్నారు.