‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ ట్రైలర్‌ విడుదల

తెలుగు హీరోయిన్‌ అంజలి టైటిల్‌ రోల్‌లో నటిస్తున్న తాజా చిత్రం ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ . 2014లో కామెడీ అండ్‌ హార్రర్‌ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన సూపర్‌ హిట్‌ చిత్రం ‘గీతాంజలి’ సినిమాకు ఈ చిత్రం సీక్వెల్‌గా రాబోతుంది. ఇక ఈ సినిమాలో శ్రీనివాస్‌ రెడ్డి కథా నాయకుడిగా నటిస్తుండగా.. సత్యం రాజేశ్‌, షకలక శంకర్‌, అలీ తదితరులు కీలక పాత్రలను పోషిస్తున్నారు. కోన వెంకట్‌ కథ, స్రీన్‌ ప్లేను అందిస్తుండగా.. శివ తుర్లపాటి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి టీజర్‌తో పాటు.. ఫస్ట్‌ సింగిల్‌ విడుదల చేయగా ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్‌ వచ్చింది.

అయితే తాజాగా మూవీ నుంచి మేకర్స్‌ ట్రైలర్‌ విడుదల చేశారు. ఈ ట్రైలర్‌ గమనిస్తే.. మొదటి పార్ట్‌లో లాగానే ఈ సినిమాలో కూడా శ్రీనివాస్‌ రెడ్డి దర్శకుడిగా నటిస్తుండగా.. హార్రర్‌ సినిమా తీద్దామని అంజలి, తన టీమ్‌తో కలిసి ఒక పాడుబడిన భవంతిలోకి వెళతారు. అయితే ఆ భవంతీలో షూటింగ్‌ జరుగుతుండగా.. వారికి దెయ్యాలు ఉన్నట్లు అనుకొని సంఘటనలు ఎదురవుతుంటాయి.

అయితే ఆ ఇంట్లో ఉన్న మూడు దెయ్యాలు ఎక్కడివి.. వారికి ఏం జరిగింది. ఈ క్రమంలోనే అంజలి అండ్‌ టీమ్‌ ఏం చేసింది అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. కామెడీ అండ్‌ హార్రర్‌ జోనర్‌లో తెరకెక్కుతున్న ఈ మూవీలో శ్రీనివాస్‌ రెడ్డి, సత్యం రాజేశ్‌, సత్య, షకలక శంకర్‌, అలీ, బ్రహ్మాజీ, రవి శంకర్‌, రాహుల్‌ మాధవ్‌ ఇతర నటీనటులు కీ రోల్స్‌ పోషిస్తున్నారు. ఎంవీవీ సినిమాస్‌ బ్యానర్‌తో కలిసి కోన ఫిలిం కార్పొరేషన్‌ బ్యానర్‌పై కోన వెంకట్‌ తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం ఏప్రిల్‌ 11న ప్రేక్షకుల ముందుకు రానుంది.