‘గీత గోవిందం’ కాంబోలో ‘ఫ్యామిలీ స్టార్‌’

’ఫ్యామిలీ స్టార్‌’ ట్రైలర్‌ రిలీజ్‌ వేడుకలో చిత్ర దర్శకుడు పరశురామ్‌, నిర్మాత దిల్‌రాజు సందడి చేశారు. నగరంలోని శ్రీరాములు థియేటర్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో విజయ్‌ దేవరకొండ అభిమానులతో కలిసి ట్రైలర్‌ వీక్షించారు. అనంతరం చిత్రాన్ని ఉద్దేశించి దర్శకుడు పరశురామ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

‘ఫ్యామిలీ స్టార్‌’ విడుదలయ్యాక.. ఈ చిత్రాన్ని, ఇందులోని నటీనటులను తెలుగు ప్రేక్షకులు కొన్నేళ్లపాటు గుర్తుపెట్టుకుంటారని అన్నారు.

అనంతరం దిల్‌ రాజు మాట్లాడుతూ.. ‘గీత గోవిందం’ కాంబోలో వస్తోన్న చిత్రమిది. ఆ స్థాయిలో వినోదం ఉండనుంది. ఎంటర్‌టైన్‌ మెంట్, కామెడీ, భావోద్వేగాలు అన్నీ కలిపిన పక్కా సమ్మర్‌ ఎంటర్‌టైనర్‌ ఇది. ఒక కుటుంబాన్ని ఉన్నతస్థాయికి తీసుకువెళ్లే ప్రతీ మనిషి ఫ్యామిలీ స్టారే. ఈ సినిమా చూశాక చాలామంది ఫ్యామిలీస్టార్స్‌లా మారతారు. నన్ను దిల్‌రాజుగా మార్చిన ’దిల్‌’ సినిమా ఏప్రిల్‌ ఐదో తేదీనే విడుదలైంది. దాదాపు 21 ఏళ్ల తర్వాత అదే డేట్‌లో ఈ సినిమా రానుంది. యూనివర్సల్‌ కంటెంట్‌తో వస్తోన్న చిత్రమిది. తప్పకుండా అందరూ ఎంటర్‌టైన్‌ అవుతారని అన్నారు. తిరుపతిలో ట్రైలర్‌ రిలీజ్‌ సెలబ్రేషన్స్‌ చేయనున్నట్లు చెప్పారు.