‘గ్యాంగ్‌ ఆఫ్‌ గోదావరి’ పోస్టర్‌ విడుదల!

టాలీవుడ్‌ నటుడు విశ్వక్‌సేన్‌ ప్రస్తుతం బ్యాక్‌ టు బ్యాక్‌ సినిమాలతో ఫుల్‌ బిజీగా ఉన్నాడు. ఇప్పటికే విశ్వక్‌ నటించిన ‘గామి’ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాగా.. మరో సినిమాను విడుదలకు సిద్ధం చేస్తున్నాడు.

విశ్వక్‌సేన్‌ నటిస్తున్న తాజా చిత్రం ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’. ఈ సినిమాకు ‘ఛల్‌ మోహన్‌ రంగ’ ఫేం కృష్ణ చైతన్య దర్శకత్వం వహిస్తున్నాడు. అంజలి, డీజే టిల్లు ఫేం నేహాశెట్టి హీరోయిన్‌లుగా నటిస్తున్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ.. మూవీ నుంచి కొత్త పోస్టర్‌ విడుదల చేశారు.

ఇక ఈ పోస్టర్‌లో అంజలి కత్తి పట్టుకుని ఊరమాస్‌ లుక్‌లో కనిపిస్తుంది. ఇక ఈ సినిమాను మొదట మార్చి 8న విడుదల చేసేందుకు మేకర్స్‌ ప్లాన్‌ చేసిన విషయం తెలిసిందే. అనుకోని కారణాల వల్ల ఈ సినిమా వాయిదా పడుతూ వస్తుంది. ఇక త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించనున్నట్లు చిత్ర యూనిట్‌ ప్రకటించింది.