హైదరాబాద్‌లో ‘గేమ్‌ ఛేంజర్‌’ హల్‌ చల్‌!

టాలీవుడ్‌ స్టార్‌ యాక్టర్‌ రాంచరణ్‌ టైటిల్‌ రోల్‌లో నటిస్తున్న చిత్రం గేమ్‌ఛేంజర్‌ స్టార్‌ డైరెక్టర్‌ శంకర్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో బాలీవుడ్‌ బ్యూటీ కియారా అద్వానీ ఫీమేల్‌ లీడ్‌ రోల్‌లో నటిస్తోంది. పొలిటికల్‌ థ్రిల్లర్‌ జోనర్‌లో వస్తోన్న గేమ్‌ ఛేంజర్‌ షూటింగ్‌ దశలో ఉంది. కాగా ఎప్పుడూ ఏదో ఒక అప్‌డేట్‌ నెట్టింట హల్‌ చల్‌ చేస్తూనే ఉంది.

లేటెస్ట్‌ షూటింగ్‌ అప్‌డేట్‌ బయటకు వచ్చింది. తాజా సమాచారం ప్రకారం గేమ్‌ ఛేంజర్‌ నయా షెడ్యూల్‌ షూటింగ్‌ హైదరాబాద్‌లో షురూ అయింది. శ్రీకాంత్‌, సముద్రఖని, ఎస్‌జే సూర్య ఇతర నటీనటులపై వచ్చే సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారని టాక్‌.. కాగా రాంచరణ్‌ త్వరలోనే సెట్స్‌లో జాయిన్‌ కాబోతున్నాడట. గేమ్‌ఛేంజర్‌లో రాజోలు భామ అంజలి, బాలీవుడ్‌ నటుడు హ్యారీ జోష్‌, ఎస్‌జే సూర్య, నవీన్‌ చంద్ర, శ్రీకాంత్‌, సముద్రఖని, జయరాయ్‌, సునీల్‌ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

ఈ చిత్రాన్ని భారీ బ్జడెట్‌, హై టెక్నికల్‌ వాల్యూస్‌తో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై దిల్‌ రాజు తెరకెక్కిస్తున్నారు. గేమ్‌ ఛేంజర్‌కు పాపులర్‌ డైరెక్టర్‌ కార్తీక్‌ సుబ్బరాజు కథనందిస్తుండగా.. సాయిమాధవ్‌ బుర్రా డైలాగ్స్‌ అందిస్తున్నారు. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానున్న ఈ చిత్రానికి ఎస్‌ థమన్‌ సంగీతం అందిస్తున్నాడు.

రాంచరణ్‌ మరోవైపు ఉప్పెన ఫేం బుచ్చిబాబు సాన డైరెక్షన్‌లో ఆర్‌సీ 16కు కూడా ఇప్పటికే గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాడు. ఈ మూవీలో ఫీ మేల్‌ లీడ్‌ రోల్‌లో సాయిపల్లవిని తీసుకున్నట్టు వార్తలు వస్తుండగా.. రాంచరణ్‌ టీం నుంచి క్లారిటీ రావాల్సి ఉంది.