గేమ్ ఛేంజర్.. దిల్ రాజు తెలిసి చేసిన రిస్కే..

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ శంకర్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు అనగానే అంచనాలు ఏ స్థాయిలో పెరిగిపోయాయో ప్రత్యేకంగా చెప్పునవసరం లేదు. ఇక ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ సినిమాను ఫ్యాన్ ఇండియా రేంజ్ లో నిర్మిస్తున్నారు. అంతేకాకుండా వారి ప్రొడక్షన్లో 50వ సినిమా అని చెప్పగానే సినిమాపై మార్కెట్లో మంచి డిమాండ్ అయితే పెరిగింది.

అయితే దిల్ రాజు అసలు మొదట శంకర్ తో సినిమా చేయాలి అనుకున్నప్పుడు బడ్జెట్ కండిషన్స్ అయితే ముందుగానే చెప్పేసారు. కానీ శంకర్ గురించి దిల్ రాజుకి తెలియనిది కాదు. గతంలో ఆయన చేసిన నిర్మాతలకు కూడా శంకర్ బడ్జెట్ విషయంలో షాకుల మీద షాకులు ఇచ్చాడు. అయితే శంకర్ గేమ్ ఛేంజర్ విషయంలో పర్ఫెక్ట్ గా ఉండరేమో అనుకున్నారు. అందుకు తగ్గట్టుగానే ప్లాన్ చేసుకున్నాడు.

కానీ ఇండియన్ 2 సినిమా మధ్యలోకి వచ్చి ప్లాన్ మొత్తం చేంజ్ చేసింది. దీంతో గేమ్ చేజర్ బడ్జెట్ కూడా అంతకంతకు పెరుగుతూనే ఉంది. అంతేకాకుండా కొన్ని సీన్స్ కోసం శంకర మరింత ఎక్కువ టైం తీసుకుంటున్నాడు. ఇక వేస్టేజ్ కూడా ఎక్కువ అవుతున్నట్లు తెలుస్తోంది. సినిమాకు సంబంధించిన అప్డేట్స్ విషయంలో కూడా అసలు ఏమాత్రం చలాకీగా కనిపించడం లేదు. దిల్ రాజు ప్రొడక్షన్ అనగానే బడ్జెట్ పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకుంటూ వెళుతూ ఉంటారు.

కానీ శంకర్ దర్శకత్వంలో చేస్తున్న సినిమాకు మాత్రం దిల్ రాజు ఏమీ చేయలేని పరిస్థితి ఏర్పడింది. సినిమా ఇప్పటికే సగం కి పైగా పూర్తయింది. ఇక ఎప్పుడు పూర్తి చేస్తాడు అనేది శంకర్ కు కూడా తెలియదు. దీంతో దిల్ రాజు రిలీజ్ డేట్ విషయంలో కూడా ఫ్యాన్స్ కు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేకపోతున్నాడు. ఏది ఏమైనా శంకర్ గురించి ముందే తెలిసినప్పటికీ దిల్ రాజు