ఇక “ఖుషి” పని గల్లంతే..!

టాలీవుడ్ లో ప్రెజెంట్ యూత్ లో భారీ ఫాలోయింగ్ ఉన్న యంగ్ హీరోస్ లో రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ఒకడు కాగా తాను మళ్ళీ ఇన్నాళ్ళకి అయితే మంచి ఓపెనింగ్స్ ని అందుకున్న సినిమాగా అయితే ఖుషీతో వచ్చాడు. స్టార్ హీరోయిన్ సమంతతో ఓ ఫుల్ ఫ్లెడ్జ్ చిత్రంగా అయితే దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కించగా. 

ఈ సినిమా అయితే మొదటి రోజే ఊహించని వసూళ్లు అందుకొని ట్రేడ్ వర్గాలకి అయితే షాకిచ్చింది. అంతే కాకుండా మొదటి మూడు రోజులు కూడా భారీ వసూళ్లు అందుకున్న ఈ చిత్రం నాలుగో రోజు నుంచి ఢాం మని పడినట్టుగా తెలుగు రాష్ట్రాల్లో భారీ డ్రాప్ ని అయితే చూసింది.

దీనితో ఖుషి కి ఇక నాలుగో రోజు నుంచి గట్టి పరీక్షే స్టార్ట్ కాగా ఇక ఈ సెప్టెంబర్ 7 తో అయితే ఖుషి కి శుభం కార్డు బాక్సాఫీస్ దగ్గర పడినట్టే అని చెప్పాలి. కాగా ఈరోజు రెండు మోస్ట్ అవైటెడ్ చిత్రాలు అనుష్క కం బ్యాక్ సినిమా “మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి” అలాగే బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ నటించిన భారీ చిత్రం “జవాన్” లు వచ్చాయి.

అయితే వీటి రాకతో ఎలాగో ఓపెనింగ్స్ మూలాన భారీ ఎఫెక్ట్ పడుతుంది. కానీ అనూహ్యంగా ఇప్పుడు రెండు సినిమాలకి కూడా సాలిడ్ పాజిటివ్ టాక్ స్టార్ట్ అయ్యింది. దీనితో అయితే ఇక ఖుషి పని గల్లంతే అని చెప్పాలి. ఇక జనం అంతా ఈ రెండు సినిమాలు మీద పడితే నెక్స్ట్ ఖుషి కి కరువవుతారు. దీనితో వచ్చే కాస్త వసూళ్లు కూడా రావని చెప్పాలి. మరి వీటితో బయ్యర్లు మాత్రం నష్టాలు చూడక తప్పదు. మెయిన్ గా ఏపీలో బయ్యర్లు నష్టపోతారు అని ట్రేడ్ వర్గాల టాక్.