ఐటమ్ సాంగ్‌తో సరిపెట్టుకోనున్న పూజా హెగ్దే.!

‘గుంటూరు కారం’ సినిమా నుంచి హీరోయిన్‌గా పూజా హెగ్ధే తప్పుకున్న సంగతి తెలిసిందే. షూటింగ్ ఆలస్యమవుతుండడంతో డేట్స్ అడ్జస్ట్ చేయలేకే పూజా హెగ్దే ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుందన్న వాదన బలంగా వుంది.

అయితే, తాజాగా అందుతోన్నసమాచారం ప్రకారం మళ్లీ పూజా హెగ్ధే ఈ ప్రాజెక్ట్‌లో భాగం కానుందని తెలుస్తోంది. ఓ స్పెషల్ సాంగ్ కోసం పూజా హెగ్ధేతో సెటిల్‌మెంట్ చేసుకున్నారట. ప్రస్తుతం ‘గుంటూరు కారం’ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. త్వరలోనే పూజా హెగ్ధేకి సంబంధించిన ఐటెం సాంగ్ షూట్ కూడా పూర్తి చేయనున్నారట.

ఇదిలా వుంటే, ఈ సినిమాలో హీరోయిన్ విషయమై గందరగోళం ఇంకా వీడలేదు. సెకండ్ హీరోయిన్ అనుకున్న శ్రీలీల మెయిన్ హీరోయిన్ అయిపోయింది. ఇక సెకండ్ హీరోయిన్ రోల్‌లో సంయుక్త హెగ్ధే పేరు వినిపించింది. ఆ రోల్‌లో ఇంకా ఎవరు ఫిక్సయ్యారన్నది తెలియాల్సి వుంది.