ఆ పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ కి ఏకంగా దర్శకుడినే మార్చారా ..?

అక్కినేని సమంత మంచి ప్రాజెక్ట్ కోసం చూస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. మజిలీ, ఓ బేబి లాంటి సూపర్ హిట్స్ తర్వాత హ్యాట్రిక్ హిట్ కోసం తమిళ సూపర్ హిట్ 96 తెలుగు రీమేక్ జాను లో నటించింది. కాని ఈ సినిమా సమంత ని బాగా డిసప్పాయింట్ చేసింది. దాంతో ఇక సినిమా కమిటవలేదు. ఈ లోపు కరోనా. కథ లు వినడానికి పనికొచ్చింది. కాని కొత్త ప్రాజెక్ట్ సెట్స్ మీదకి తీసుకు వచ్చేందుకు మాత్రం కుదరలేదు. అయితే సక్సస్ ఫుల్ వెబ్ సిరీస్ ఫ్యామిలీ మాన్ సీజన్ 2 లో మాత్రం నటించింది. ఈ వెబ్ సిరీస్ కంప్లీటయిందని మేకర్స్ వెల్లడించగా ఈ వెబ్ సిరీస్ కి సమంత తన పాత్రకి తనే స్వయంగా డబ్బింగ్ చెప్పుకుంది.

Remuneration war between Samantha and Nayanthara?

కాగా తమిళంలో నయనతార తో కలిసి నయన్ బాయ్ ఫ్రెండ్ విగ్నేష్ శివన్ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతుందని వార్తలు వచ్చాయి. కాని ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన అఫీషియల్ న్యూస్ మాత్రం రాలేదు. అయితే గత కొన్ని రోజులుగా ఓ బేబి దర్శకురాలు బి.వి.నందిని రెడ్డి దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి సమంత ప్లాన్ చేసుకుందని వార్తలు వచ్చాయి. అంతేకాదు ఈ సినిమాలో భర్త నాగ చైతన్య కూడా నటించే అవకాశాలున్నాయని ప్రచారం జరిగింది. కాని ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన న్యూస్ కూడా అఫీషియల్ గా వెల్లడి కాలేదు.

Ashwin Saravanan, Samantha to team up?- Cinema express

కాని తాజాగా ఒక న్యూస్ మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కోలీవుడ్ దర్శకుడు అశ్విన్ శరవనన్ తెరకెక్కించబోయో ఒక పాన్ ఇండియా సినిమాలో నటించేందుకు సమంత ఒకే చెప్పిందని ఆ మధ్య వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. డిసెంబర్ నుండి ఈ సినిమా సెట్స్ మీదకి వెళ్ళబోతుందని అన్నారు. తెలుగు, తమిళంతో పాటు అన్ని భాషల్లో ఈ సినిమాను విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నట్టు చెప్పుకున్నారు.

Samantha to team up with director Nandini Reddy? | Telugu Movie News -  Times of India

ఇక ఈ సినిమాని బాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ సోనీ పిక్చర్స్ నిర్మించనున్నారు. అయితే ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ దర్శకులు మారినట్లుగా వార్తలు వస్తున్నాయి. అశ్విన్ శరవనన్ తప్పుకుని ఈ సినిమాకు ఓ బేబీ దర్శకురాలు నందిని రెడ్డి దర్శకత్వం వహించబోతున్నట్లుగా కోలీవుడ్ మీడియా సమాచారం. ఇందులో ఎంతవరకు నిజముందో తెలీదు గాని ఏకంగా పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ నుంచి దర్శకుడు మారడం మాత్రం హాట్ టాపిక్ అవుతోంది.