“మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి” మొదటి మెగా రివ్యూ.!

టాలీవుడ్ లో ఉన్న సీనియర్ స్టార్ హీరోయిన్స్ లో భారీ క్రేజ్ ఉన్న వన్ అండ్ ఓన్లీ పీస్ హీరోయిన్ అనుష్క శెట్టి అవైటెడ్ రిలీజ్ సినిమా “మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి” కోసం ఆడియెన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పైగా ఆమె నటించిన థియేట్రికల్ రిలీజ్ ఇది కావడంతో అంచనాలు కూడా గట్టిగా ఉన్నాయి.

ఇంకా జాతిరత్నాలు హీరో నవీన్ పోలిశెట్టి హీరోగా నటించిన ఈ సినిమాని యంగ్ దర్శకుడు మహేష్ బాబు అయితే తెరకెక్కించాడు. ఇప్పటికే వచ్చిన టీజర్ ట్రైలర్ లు ఆకట్టుకోగా సినిమా హిట్ అవుతుంది అనే నమ్మకాన్ని తీసుకొచ్చింది. అయితే ఇపుడు ఈ సినిమా రెండు రోజులు ఇంకా సమయం ఉండగానే ఒక మొట్టమొదటి మెగా రివ్యూ అయితే బయటకి వచ్చేసింది.

కాగా ఈ చిత్రాన్ని మెగాస్టార్ చిరంజీవి చూసి సినిమాపై తన రివ్యూ ఇవ్వడం ఇపుడు వైరల్ గా మారింది. హీరో నవీన్ అండ్ యూవీ క్రియేషన్స్ వారు మెగాస్టార్ ని కలిసి స్పెషల్ షో తనకి వేయగా తాను తన స్పందన పంచుకున్నారు.

“‘మిస్ శెట్టి – మిస్టర్ పోలిశెట్టి’ చూశాను.. మొదటి నుంచి చివరి దాకా ఎంతగానో ఆకట్టుకున్న హిలేరియస్ ఎంటర్టైనర్. నేటి యువత ఆలోచనా విధానాన్ని రిఫ్లెక్ట్ చేస్తూ తీసుకున్న సరికొత్త కధాంశం, ‘జాతి రత్నాలు’ కి రెట్టింపు ఎనర్జీ ని, వినోదాన్ని అందచేసిన నవీన్ పోలిశెట్టి, కొంచెం గ్యాప్ తర్వాత కనిపిస్తున్నా మరింత అందంగా, బ్యూటిఫుల్ గా వున్న మనందరి ‘దేవసేన’, అనూష్క శెట్టి లు ఈ చిత్రానికి ప్రాణం పోశారు.

ఫుల్ లెంగ్త్ ఎంటర్టైనర్ అవటంతో పాటు ఎమోషన్స్ ని కూడా అద్భుతంగా మిక్స్ చేసి రక్తి కట్టించేలా రూపుదిద్దిన డైరెక్టర్ మహేష్ బాబు ని అభినందించాల్సిందే. అన్నట్టు ఈ చిత్రానికి తొలి ప్రేక్షకుడ్ని నేనే.. ఆ హిలేరియస్ మూమెంట్స్ ఎంతగానో ఎంజాయ్ చేశాను. మరోసారి థియేటర్ లో ప్రేక్షకులందరి తోనూ ఎంజాయ్ చేయాలన్న బలమైన కోరిక నాకు కలిగింది.

మిస్ శెట్టి – మిస్టర్ పోలిశెట్టి 100% ఆడియన్స్ ని నవ్వుల బాట పట్టిస్తారనటంలో సందేహం లేదు.” అంటూ ఎన్నో లాఫింగ్ ఎమోజిస్ పెట్టి మెగాస్టార్ మొట్టమొదటి రివ్యూ ని ఈ సినిమాపై అందించారు. దీనితో ఈ ఫస్ట్ ఎవర్ రివ్యూ వైరల్ గా మారింది. మరి ఇది సినిమాకి ఏమన్నా బూస్టప్ అవుతుందో లేదో చూడాలి.