ఫైనల్ గా తన అవైటెడ్ కాంబినేషన్ స్టార్ట్ చేసిన శేఖర్ కమ్ముల 

కాస్త ఆలస్యం అయినా కూడా ఆల్ మోస్ట్ హిట్ సినిమాలతోనే వచ్చే దర్శకుడు శేఖర్ కమ్ముల ఒకో సినిమాకి చాలా గ్యాప్ తీసుకునే శేఖర్ కమ్ముల లాస్ట్ గా డెలివర్ చేసిన హిట్ చిత్రం “లవ్ స్టోరీ”. దానికి ముందు “ఫిదా” కి దానికి మూడేళ్లు గ్యాప్ తీసుకున్న శేఖర్ కమ్ముల ఇప్పుడు మళ్ళీ లవ్ స్టోరీ తర్వాత తాను చేస్తున్న సినిమాకి రెండున్నరేళ్లు గ్యాప్ తీసుకున్నారు.

కాగా ఇప్పుడు శేఖర్ కమ్ముల మొదటి సారిగా ఓ స్టార్ హీరోతో సినిమా చేస్తుండడంతో మంచి అంచనాలు నెలకొన్నాయి. తమిళ నాట అలాగే సౌత్ లో మంచి పేరున్న హీరో ధనుష్ తో తాను సినిమా చేస్తున్నారు. ఇది ఎప్పుడో అనౌన్స్ అయ్యింది కానీ పట్టాలెక్కేందుకు ఇప్పుడు వరకు సమయం తీసుకుంది.

ఫైనల్ గా ఈరోజు సినిమా షూటింగ్ ని మేకర్స్ స్టార్ట్ చేస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు. దీనితో ఈ క్రేజీ కాంబినేషన్ కోసం చూస్తున్న వారికి మాత్రం ఫైనల్ గా గుడ్ న్యూస్ ఇవాళ వచ్చింది అని చెప్పాలి. కాగా ఈ చిత్రంలో అక్కినేని నాగార్జున కూడా ఒక పాత్రలో నటించనున్నారు.

ఇక శేఖర్ కమ్ముల ఈ చిత్రాన్ని కూడా లవ్ స్టోరీ సినిమా లానే కొన్ని నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కిస్తున్నారని రూమర్స్ ఉన్నాయి. అలాగే ఇది శేఖర్ కమ్ముల రొటీన్ ఎంటర్టైనర్ లా కాకుండా మంచి హార్డ్ హిట్టింగ్ గా కూడా ఉంటుంది అని బజ్. ఇక ఈ సినిమాలో రష్మికా మందన్నా హీరోయిన్ గా ఫిక్స్ కాగా శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి వారు నిర్మాణం వహిస్తున్నారు.