కొన్నేళ్ళుగా ఊహించుకున్న బాలయ్య సినిమా ఇక రానట్టే ..!

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా బాలయ్య కెరీర్ లో 106 గా రూపొందుతుండగా ఈ సినిమాతో ఇద్దరు హ్యాట్రిక్ హిట్ కొట్టాలని చాలా పట్టుదలగా ఉన్నారు. ఇక ఇప్పటికే ఈ సినిమా ఒక షెడ్యూల్ కంప్లీట్ చేసుకుంది. లాక్ డౌన్ కారణంగా ఆగిపోయిన ఈ సినిమాని త్వరలో మళ్ళీ సెట్స్ మీదకి తీసుకు రాబోతున్నారు. బిబి3 అన్న వర్కింగ్ టైటిల్ తో పిలుచుకుంటున్న ఈ సినిమాకి గత కొన్ని రోజులుగా “మోనార్క్” అన్న టైటిల్ ని పరిశీలిస్తున్నారు.

Balakrishna Boyapati BB3 First Roar Teaser Releasing Today • AgraTara

ఇక ఈ సినిమాలో బాలయ్య సరసన నటించే ఇద్దరు హీరోయిన్స్ ని ఫైనల్ చేయాల్సి ఉంది. ఎప్పటి నుంచో బాలయ్య సరసన నటించే హీరోయిన్స్ కోసం పలువురు పేర్లు పరిశీలిస్తున్నప్పటికి ఎవరు ఫిక్స్ కాలేదు. ఇక ఈ సినిమా తర్వాత బాలయ్య డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో నటిస్తాడని అంటున్నారు. లాక్ డౌన్ లో పూరి బాలయ్య కోసం కథ రాసినట్టు వార్తలు వస్తున్నాయి. ఆ కథ బాలయ్య కి కూడా నచ్చిందని సమాచారం.

Puri Jagannadh Shamelessly Defends Balakrishna

అయితే తాజాగా బాలయ్య సినిమాకి సంబంధించిన ఒక న్యూస్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. గతంలో ప్రముఖ సీనియర్ దర్శకులు సింగీతం శ్రీనివాస రావు – బాలకృష్ణ ల కాంబినేషన్ లో వచ్చిన ఆదిత్య 369 సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఈ సినిమాకి సీక్వెల్ నిర్మించాలని దర్శకులు సింగీతం శ్రీనివాస రావు.. బాలయ్య అనుకున్నారు. కాని ఎందుకనో ఈ ప్రాజెక్ట్ సెట్ కాలేదు. మళ్ళీ ఇన్నాళ్ళకి ఈ సినిమాకి సీక్వెల్ గా ఆదిత్య 999 రూపొందనుందని వార్తలు వచ్చాయి.

సైన్స్ ఫిక్షన్ కావడంతో ఈ సినిమాని భారీ బడ్జెట్ తో నిర్మించనున్నారని చెప్పుకొచ్చారు. కాని లేటెస్ట్ న్యూస్ ఏమిటంటే ఇక ఇప్పట్లో ఈ సినిమా ఉండదని సమాచారం. ప్రస్తుతం సింగీతం శ్రీనివాస రావు .. ప్రభాస్ – నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో రూపొందబోతున్న సినిమాకి క్రియోటివ్ హెడ్ గా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా కంప్లీటవడానికి సంవత్సరం పైనే పడుతుంది. ఆ తర్వాత పరిస్థితులని బట్టి ఉంటే బాలయ్య – సింగీతం శ్రీనివాస రావు ల ఆదిత్య 999 ఉండొచ్చు. లేదంటే కష్టమే అంటున్నారు.