Acharya : ‘ఆచార్య’ సినిమా స్టోరీ లైన్ లీక్..!సినిమా మీద పెరిగిన అంచనాలు..

Acharya : ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత రామ్ చరణ్ నుంచి వస్తున్న సినిమా ఆచార్య. ఆచార్య సినిమాలో మెగాస్టార్ చిరంజీవి తో రామ్ చరణ్ కలిసి నటిస్తూ ఉండటం వలన ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి ట్రైలర్ ని కూడా విడుదల చేశారు. ట్రైలర్ విడుదలైన 24 గంటలలోనే 20 మిలియన్ వ్యూస్ ని సొంతం చేసుకుని రికార్డు సృష్టించింది. ట్రైలర్కు అభిమానుల నుంచి మంచి స్పందన కూడా లభిస్తోంది.

అంతేకాకుండా మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత తీసిన సినిమా ఖైదీ 150 హిట్ అయినా కూర అది ఒక రీమేక్ సినిమా కావడంతో అంత ఆదరణ పొందలేకపోయింది. ఇప్పుడు కొరటాల శివ, మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమాపై అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. కాగా సినిమా విడుదల సమయం దగ్గర పడుతున్న వేళ సినిమాకు సంబంధించిన స్టోరీ లైన్ ఇదే అంటూ ఒక లైన్ లీక్ అయింది.అయితే చెర్రీ క్యారెక్టర్ సెకండాఫ్‌లో 30 నిమిషాల పాటు ఉంటుందని ఇప్పటి వరకు టాక్ బయటకు వచ్చింది. ఇదిలావుండగా లేటెస్ట్ టాక్ ప్రకారం చెర్రీ క్యారెక్టర్ ఫస్టాఫ్‌లోనే ఉంటుందని.. చెర్రీ – చిరు మధ్య వచ్చే సీన్లు కూడా ఫస్టాఫ్‌లోనే ఉంటాయని అంటున్నారు. ఇకపోతే ఈ సినిమా కథ ధర్మస్ధలిలో స్టార్ట్ అవుతుంది అని చెప్తున్నారు.

ఇక లీక్ అయిన కథ ప్రకారం….అయితే సిద్ధా(రామ్ చరణ్ ).. పూజా హెగ్డేతో ప్రేమలో పడతాడు. ఈ క్రమంలోనే సిద్ధ కు, సోనూసుద్‌కు గొడవలు స్టార్ట్ అవుతాయి. ఇక కొన్ని కారణాల వల్ల సిద్ధ ఊరు వదిలి వెళ్లిపోతాడు. అంతేకాదు అలా ఊరు వదిలి వెళ్లిన సిద్ధ చిరంజీవి లీడర్‌గా ఉన్న నక్సలైట్ల గ్రూపులో చేరతాడు.కాగా అక్కడ చిరంజీవికి గురించి.. తన ఊరు గురించి పరిస్థితి వివరిస్తాడు. ఇకపోతే అక్కడ సిద్ధ ప్రాణాలు కోల్పోతాడు.అయితే ఈ క్రమంలోనే సిద్ధ ఊరులో సమస్యలు పరిష్కరించేందుకు ధర్మస్థలికి ఆచార్య ఎంట్రీ ఇస్తాడు. ఇక చివరకు అక్కడ విలన్ల భరతం ఎలా ? ఇక పట్టాడు అన్నదే ఈ సినిమా స్టోరీ అంటున్నారు.చూడాలి మరి కొరటాల తీసిన స్టోరీ ఇదేనా కాదా అన్నది.