సూపర్ స్టార్ సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఇప్పటికే రెండు షెడ్యూల్స్ కంప్లీట్ చేసుకుంది. ప్రస్తుతం షూటింగ్ కి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కొంత గ్యాప్ ఇచ్చారు. ఈ సినిమాలో హీరోయిన్గా పూజ హెగ్డే, శ్రీ లీల నటిస్తూ ఉన్నారు.

ఇదిలా ఉంటే పల్నాడు బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కనున్న ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ గ్లింప్స్, టైటిల్ పోస్టర్ ను మే 31న రిలీజ్ చేయడానికి సన్నహాలు చేస్తున్న సంగతి తెలిసిందే. సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా ఆరోజు ఫ్యాన్స్ కి సర్ప్రైజ్ గా మహేష్ బాబు సినిమా నుంచి ట్రీట్ ప్లాన్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమాకి సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇప్పుడు తెరపైకి వచ్చింది.

ప్రస్తుతం సౌత్ లో మోస్ట్ ట్రెండింగ్ గా కొనసాగుతున్న జగపతిబాబు ఈ సినిమాలో కూడా ప్రతినాయకుడుగా కనిపించబోతున్నారంట. ఈ విషయాన్ని జగపతిబాబు స్వయంగా ఓ ఇంటర్వ్యూలో తెలియజేయడం విశేషం. అరవింద సమేతలో జగపతిబాబు బసిరెడ్డి పాత్రలో పవర్ ఫుల్ ప్రతి నాయకుడుగా కనిపించారు. ఆ పాత్ర జగపతిబాబుకి మరింతగా స్టార్ ఇమేజ్ తీసుకొచ్చింది.

ఇప్పుడు బసిరెడ్డి కంటే మరింత పవర్ ఫుల్ పాత్రని సూపర్ స్టార్ 28 సినిమాలో రాశారంట. ఈ విషయాన్ని జగపతిబాబు మీడియాతో పంచుకున్నారు. బసిరెడ్డి పాత్ర తనకు ఎంత సంతృప్తి నిచ్చిందో అంతకంటే ఎక్కువగా మహేష్ బాబు సినిమాలో తాను చేయబోయే పాత్ర ఉండబోతుందని చెప్పారు. దీనిని బట్టి త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈసారి మహేష్ కోసం తన స్టైల్ లోనే ఫ్యామిలీ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ ని అందించబోతున్నారని విషయం అర్థమవుతుంది.

ఇక ఈ కథ విషయంలో రెండు మూడు సార్లు మార్పులు చేశారంటూ జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదనే విషయం తెలుస్తోంది. ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యామిలీ లో వెకేషన్ లో ఉన్నారు. అక్కడ నుంచి వచ్చిన తర్వాత షూటింగ్ స్టార్ట్ చేసే అవకాశాలు ఉన్నాయంట.