మళ్ళీ బడ్జెట్ లిమిట్స్ దాటేస్తున్నారు?

మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి సినిమా అంటే హై వోల్టేజ్ లో ఉంటుంది. యాక్షన్ సీక్వెన్స్ అన్ని కూడా నెక్స్ట్ లెవల్ లో ప్లాన్ చేస్తారు. బడ్జెట్ తో మెజారిటీ యాక్షన్ సీక్వెన్స్ కోసమే ఖర్చు చేస్తూ ఉంటారు. ఇప్పుడు రామ్ పోతినేనితో చేస్తోన్న పాన్ ఇండియా మూవీకి కూడా అదే స్థాయిలో బోయపాటి ఖర్చు చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో సినిమాల బడ్జెట్ లు విపరీతంగా పెరిగిపోతున్నాయి.

అంతే స్థాయిలో బిజినెస్ మాత్రం జరగడం లేదు. అయితే సినిమా రిలీజ్ తర్వాత హిట్ అయితే కలెక్షన్స్ వస్తాయని భావిస్తున్న నిర్మాతలకి ఈ ఏడాదిలోనే శాకుంతలం, ఏజెంట్ లాంటి సినిమాలు షాక్ ఇచ్చాయి. ఇదిలా ఉంటే ఇప్పుడు రామ్, బోయపాటి మూవీ బడ్జెట్ కూడా ఆరంభంలో అనుకున్నదాటి కంటే దాటిపోయిందంట. సినిమా షూటింగ్ ఇంకా జరుగుతుంది.

తరువాత పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా స్టార్ చేయాలి. అలాగే ప్రమోషన్స్ కోసం ఖర్చు చేయాలి. అయితే ప్రొడక్షన్ దశలోనే అనుకున్న బడ్జెట్ దాటిపోవడంతో నిర్మాతని టెన్షన్ పెడుతోంది అనే మాట వినిపిస్తోంది. ఈ సినిమా కోసం ఎద్దులని ఉపయోగించారు. అలాగే ఫైట్ సీక్వెన్స్ కోసం ఫైటర్స్ ని పదుల సంఖ్యలో వాడారంట. అలాగే ఫైట్స్, సాంగ్స్ చిత్రీకరణ కోసం ఏకంగా 29 జేనరేటర్లు వాడుతున్నారని తెలుస్తోంది.

అలాగే ప్రత్యేక గీతం కోసం బాలీవుడ్ బ్యూటీ ఊర్వశీ రౌతేలాని దించారు. శ్రీలీల ఈ మూవీలో హీరోయిన్ గా నటిస్తోంది. రామ్, శ్రీలీల మీద ఫారిన్ లోకేషన్స్ లో సాంగ్స్ చిత్రీకరిస్తున్నారు. వీటి కారణం బడ్జెట్ విపరీతంగా అవుతుందంట. శ్రీనివాస్ చిట్టూరి ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ నిర్మాతకి ది వారియర్ రూపంలో భారీ డిజాస్టర్ వచ్చింది.

తాజాగా కస్టడీ మూవీ కూడా ఫ్లాప్ అయ్యింది. అయిన కూడా బోయపాటి మీద ఉన్న నమ్మకంతో ఎక్కువగానే సినిమాపై ఖర్చు చేస్తున్నారని తెలుస్తోంది. మరి నిర్మాత నమ్మకాన్ని నిలబెట్టే విధంగా రామ్ తో చేస్తోన్న ఈ సినిమాని పాన్ ఇండియా లెవల్ లో గ్రాండ్ సక్సెస్ అందుకుంటారా లేదా అనేది చూడాలి.