ఆచార్య లో చిరంజీవికి విలన్ సోనూసూద్ అనుకున్నారు.. అదే పెద్ద పొరపాటు..అసలు విలన్ వేరే..!

ఆచార్య.. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం. ఈ సినిమా చిరంజీవి కెరీర్ లో 152 గా రాబోతోంది. కొణిదెల ప్రొడక్షన్స్ – మాట్నీ మూవీస్ బ్యానర్స్ పై మెగా పవర్ స్టార్ రాం చరణ్ – నిరంజన్ రెడ్డి సంయుక్తంగా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాలో రాం చరణ్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నాడు. చెప్పాలంటే మెగా ఫ్యాన్స్ కి సర్‌ప్రైజ్ గా దర్శకుడు కొరటాల శివ మల్టీస్టారర్ గా తెరకెక్కిస్తున్నాడు. కాజల్ అగర్వాల్ మెగాస్టార్ కి జంటగా నటిస్తుండగా చరణ్ కి జంటగా పూజా హెగ్డే నటిస్తుందని సమాచారం.

ఇక ఈ సినిమా సమ్మర్ కానుకగా మే 13 న భారీ స్థాయిలో రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే ఆచార్య సినిమా మీద మోషన్ పోస్టర్ రిలీజ్ చేసినప్పటి నుంచి అలాగే చరణ్ పోషిస్తున్న సిద్ద పాత్ర లుక్ రిలీజైనప్పటి నుంచి సినిమా మీద భారీగా అంచనాలు పెరిగాయి. అయితే ఈ సినిమాలో తణికెళ్ళ భరణి, సోనూసూద్ సహ పలువురు కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. దాంతో ఈ సినిమాలో చిరంజీవి కి విలన్ గా సోనూసూద్ నటిస్తున్నాడని ఇన్నాళ్ళు అందరు భావించారు. కాని తాజా సమాచారం ప్రకారం ఆచార్య సినిమాలో విలన్ సోనూసూద్ కాదని తెలుస్తోంది.

ఈ సినిమాలో విలన్ గా జిషు సేన్ గుప్తాను ఎంచుకున్నారని సమాచారం. జిషు సేన్ గుప్తా ఇప్పటికే తెలుగులో రెండు సినిమాల్లో నటించాడు. నితిన్ ‘భీష్మ’ నాగ శౌర్య ‘అశ్వత్థామ’లో నెగెటివ్ రోల్ లో నటించి ఆకట్టుకున్నాడు. ఇప్పుడు ఆచార్య సినిమాలో మెగాస్టార్ ని ఢీకొనే పాత్రలో కనిపించబోతున్నాడు జిషు సేన్ గుప్తా. ఇప్పటికే జిషు సేన్ పై.. కొన్ని క్లైమాక్స్ సీన్స్ కంప్లీట్ చేశారని సమాచారం. ఇక మెగాస్టార్ ఈ సినిమా తర్వాత మోహన్ రాజా దర్శకత్వంలో మలయాళ సూపర్ హిట్ లూసీఫర్ తెలుగు రీమేక్ లో నటించబోతున్నారు. ఆ తర్వాత మరో రెండు ప్రాజెక్ట్స్ ని సెట్స్ మీదకి తీసుకు రానున్నారు మెగాస్టార్.