కమల్‌హాసన్‌, దర్శకుడు మణిరత్నం కాంబో లో దుల్కర్‌ సల్మాన్‌

అగ్ర నటుడు కమల్‌హాసన్‌, దిగ్గజ దర్శకుడు మణిరత్నం కాంబినేషన్‌లో వచ్చిన ‘నాయకుడు’ 1987 చిత్రం ఓ క్లాసిక్‌గా నిలిచిన విషయం తెలిసిందే. ఇక దాదాపు 36 ఏండ్ల విరామం తర్వాత వీరిద్దరి కలయికలో ఓ సినిమా రాబోతుంది.’కె. హెచ్ 234′ వర్కింగ్‌ టైటిల్‌తో వస్తున్న ఈ సినిమా రీసెంట్‌గా లాంచ్‌ అయ్యింది.

రాజ్‌కమల్‌ ఇంటర్నేషనల్‌, మద్రాస్‌ టాకీస్‌ పతాకాలపై కమల్‌హాసన్‌, మణిరత్నం, ఆర్‌.మహేంద్రన్‌, శివ అనంత్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆస్కార్‌ అవార్డు గ్రహీత ఏ.ఆర్‌.రెహమాన్‌ సంగీతాన్నందిస్తున్నారు.

ఇదిలా ఉంటే.. తాజాగా ఈ సినిమా నుంచి మేకర్స్‌ సాలిడ్‌ అప్‌డేట్‌ను ఇచ్చారు. ఇప్పటికే స్టార్‌ హీరోయిన్‌ త్రిష ఈ మూవీ కాస్ట్‌లో భాగం అవగా.. తాజాగా మలయాళ నటుడు దుల్కర్‌ సల్మాన్‌ కూడా చేరారు. ఈ సినిమాలో దుల్కర్‌ కీలకపాత్ర పోషిస్తున్నాడు. తాజాగా మేకర్స్‌ దుల్కర్‌ సల్మాన్‌ ఈ సినిమాలో భాగమైనట్లు అఫీషియల్‌గా ప్రకటించారు.