దటీజ్.. ‘డబుల్‌ ఇస్మార్ట్‌”!

రామ్‌ కథానాయకుడిగా పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో రూపొందిన బ్లాక్‌బస్టర్‌ చిత్రం ‘ఇస్మార్ట్‌ శంకర్‌’. 2019లో విడుదలైన ఈ చిత్రం అటు పూరి, ఇటు రామ్‌కు ఓ డిఫరెంట్‌ ఇమేజ్‌ను తీసుకొచ్చింది. ఇప్పుడు ఆ సినిమాకు కొనసాగింపుగా ‘డబుల్‌ ఇస్మార్ట్‌’ వచ్చింది. ఈ మూవీకి సంబంధించి 85 సెకన్ల వీడియోను విడుదల చేశారు. ఈ క్రమంలో ‘డబుల్‌ ఇస్మార్ట్‌ రీక్యాప్‌’ అంటూ స్పెషల్‌ వీడియో పూరి జగన్నాథ్‌ విడుదల చేశారు. ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ సినిమాలోని సన్నివేశాలతో పాటు… అప్పుడు థియేటర్స్‌లో అభిమానులు చేసిన సందడితో కూడిన సన్నివేశాలను ఇందులో పొందుపరిచారు. దటీజ్..’ఇస్మార్ట్‌ శంకర్‌’!