చిరంజీవి తన కుమార్తెకు అంత ఖరీదైన బంగ్లా కానుకగా ఇవ్వడానికి కారణం ఏంటో తెలుసా?

తెలుగు చిత్ర పరిశ్రమలో మెగాస్టార్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న చిరంజీవి ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తన కష్టంతో ఇండస్ట్రీలో అంచలంచలుగా ఎదుగుతూ నేడు ఎంతో గొప్ప స్థానంలో ఉన్నారు. ఇలా ఇండస్ట్రీలో తనకంటూ ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న చిరంజీవి ఎన్నో సేవా కార్యక్రమాలలో ఎంతో చురుగ్గా పాల్గొంటూ తన మంచి మనసును చాటుకుంటారు. ఈ విధంగా ఇండస్ట్రీలో ఉండే కార్మికుల కోసం అలాగే అభిమానుల కోసం ఈయన ఎంతో కృషి చేస్తూ ఉన్నారు.ఈ విధంగా బయట వారి కోసం ఎంత సహాయం చేస్తున్న ఈయన సొంత కుటుంబ సభ్యుల పట్ల ఎంతో జాగ్రత్తలు తీసుకుంటారని మనకు తెలిసిందే.

ఇక కొణిదెల ఇంటి ఆడపిల్లల విషయంలో చిరంజీవిఎప్పుడూ ఉన్నతంగానే ఆలోచిస్తారు ఈ క్రమంలోనే తన భార్య సురేఖ సలహాలు సూచనలు మేరకు ఈయన తన సోదరీమణులకు కోట్ల రూపాయల విలువ చేసే భూములను రాసిచ్చారట. అయితే తన చిన్న కుమార్తె శ్రీజకు సైతం చిరంజీవి ఓ అందమైన ఇంటిని కానుకగా ఇచ్చినట్టు తెలుస్తోంది.ఈయన తన సినిమాల ద్వారా సంపాదించిన డబ్బుతో హైదరాబాద్లోని ఎమ్మెల్యే నగర్ కాలనీలో ఒక అందమైన భవంతిని కొనుగోలు చేశారట. ఈ ఇంటి విలువ దాదాపు 35 కోట్ల వరకు ఉంటుందని సమాచారం.

ఇలా చిరంజీవి శ్రీజకు ఇంత మొత్తంలో ఖరీదు చేసే ఇంటిని కానుకగా ఇవ్వడానికి గల కారణం ఏంటి అనే విషయానికి వస్తే…శ్రీజ మొదట శిరీష్ భరద్వాజ్ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు వీరిద్దరికీ ఒక పాప జన్మించింది. అదేవిధంగా తనతో మనస్పర్ధలు రావడం ఇద్దరు విడాకులు తీసుకొని వెళ్ళిపోవడం జరిగింది. ఇక శ్రీజకు కళ్యాణ్ దేవ్ అనే వ్యక్తితో చిరంజీవి ఎంతో ఘనంగా వివాహం జరిపించారు. అయితే వీరిద్దరి బంధానికి గుర్తుగా ఒక కుమార్తె జన్మించింది.అయితే వీరిద్దరూ కూడా ప్రస్తుతం విడిపోయారని సమాచారం అందుకే తన పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకున్నటువంటి చిరంజీవి తన కుమార్తె శ్రీజకు ఖరీదైన బంగ్లా కానుకగా ఇచ్చారని సమాచారం.