రంగస్థలం సినిమాలో మిస్ చేసుకున్న హీరోయిన్ ఎవరో తెలుసా..?

సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన “రంగస్థలం” సినిమా విడుదలై మంచి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ సమంత జంటగా నటించారు. ఈ సినిమాలో రామ్ చరణ్ చెవిటి వాడిలా నటించగా… సమంత అచ్చం పల్లెటూరి అమ్మాయిల నటించి తన నటనతో ప్రేక్షకుల్ని మరింత ఆకట్టుకుంది. అయితే తాజాగా ఈ సినిమా గురించి ఒక వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో రామ్ చరణ్ కి జోడిగా మొదటగా కీర్తి సురేష్ ని సంప్రదించినట్లు సమాచారం. అయితే ఆ సమయంలో కీర్తి సురేష్ ఇతరా సినిమా షూటింగ్ లతో బిజీగా ఉండటం వల్ల రంగస్థలం సినిమాని రిజెక్ట్ చేసింది.

అయితే ఈ సినిమాని మిస్ చేసుకోవటం కీర్తి సురేష్ జీవితంలో బిగ్గెస్ట్ మిస్టేక్ అని చెప్పవచ్చు. రంగస్థలంలో కీర్తి సురేష్ ఆ పాత్ర చేసి ఉంటే ఆమె కెరీర్ వేరేలా ఉండేదని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాలో డి గ్లామర్ పాత్రలో నటించిన సమంత తన అభినయంతో ప్రేక్షకులకు మరింత చేరువయ్యింది. ఇక ప్రస్తుతం సమంత నాగచైతన్య నుండి విడిపోయిన తర్వాత వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ బిజీగా ఉంటుంది. తాజాగా సమంత నటించిన యశోద సినిమా విడుదలకు సిద్ధం అవుతున్నట్లు సమాచారం.

ఇక కీర్తి సురేష్ కూడా ఇటు తెలుగు అటు తమిళ్ భాషలలో వరుస సినిమాలలో నటిస్తూ స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందింది. గత కొంతకాలంగా కీర్తి సురేష్ పెళ్లి గురించి సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే ఇటీవల ఈ విషయంపై స్పందించిన కీర్తి సురేష్ జీవితంలో మరింత పైకి ఎదగాలని ఆశపడుతున్నట్లు తన పెళ్లి గురించి వస్తున్న వార్తలను కొట్టి పారేసింది. ప్రస్తుతం నాని హీరోగా నటిస్తున్న దసరా సినిమాలో నానికి జోడిగా నటించింది. దసరా కానుకగా విడుదల కావలసిన ఈ సినిమా కొన్ని కారణాలవల్ల వాయిదా పడింది.