బేబీ రియల్ స్టొరీ ఏంటో తెలుసా?

సాయి రాజేష్ దర్శకత్వంలో ఆనంద దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ కాంబినేషన్ లో తెరకెక్కి ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం బేబీ. ముక్కోనపు ప్రేమ కథ చిత్రంగా ఈ సినిమాని దర్శకుడు సిల్వర్ స్క్రీన్ పై ఆవిష్కరించారు. ఎస్ కే ఎన్ ఏకంగా 10 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు. ఈ సినిమా థియేటర్స్ లోకి వచ్చి సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతుంది.

ముఖ్యంగా యూత్ ఆడియన్స్ నుంచి విపరీతమైన స్పందన వస్తోంది. ముఖ్యంగా యువతరం ప్రేమ కథలను, ఫెయిల్యూర్ లవ్ స్టోరీలని ఈ సినిమా చూసిన తర్వాత రిలేట్ చేసుకుంటున్నారు. ప్రతి ఒక్కరి లైఫ్ లో ఇక విఫల ప్రేమకథ ఉంటుంది. అయితే దానిని చూపించే విధానం బట్టి ఆడియన్స్ కి కనెక్ట్ అవుతుంది. బేబీ సినిమాని దర్శకుడు సాయి రాజేష్ విమెన్ సెంట్రిక్ గా చేసిన అది ఆడియన్స్ కి మరో రకంగా కనెక్ట్ అయ్యింది.

ఇదిలా ఉంటే ఈ సినిమా స్టొరీ రాయడానికి గల కారణాన్ని దర్శకుడు సాయి రాజేష్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో రివీల్ చేశారు. తమిళనాడులో ఓ అమ్మాయి ఆటో డ్రైవర్ తో సెల్ఫీ తీసుకుంది. తరువాత కాలేజీ లో మరో అబ్బాయితో కూడా అలాగే సెల్ఫీ తీసుకుంది. అదే రోజు నైట్ ఆమె ఫోటోలలో ఉన్న కాస్ట్యూమ్స్ తోనే డెడ్ బాడీగా కనిపించింది. ఆ ఇద్దరు బాయ్ ఫ్రెండ్స్ కలిసి ఆ అమ్మాయిని చంపేశారు.

మా ఫ్రెండ్స్ వాట్సాప్ గ్రూప్ లో ఈ న్యూస్ షేర్ అయ్యి వచ్చింది. దానిని చూసి బేబీ కథ ఆలోచన వచ్చింది. ఆ అమ్మాయిని చంపడానికి అబ్బాయిలు ఇద్దరికి కొన్ని కారణాలు ఉండొచ్చు. కాని వారిద్దరిని లవ్ చేయడం వెనుక ఆ అమ్మాయికి కూడా ఏదో ఒక కారణం ఉంటుంది కదా అనిపించింది. అలా ఆలోచించి బేబీ కథని స్టార్ట్ చేయడం జరిగింది. తరువాత ఈ కథని వైష్ణవి కంటే ముందుగా ముగ్గురు తెలుగు హీరోయిన్స కి చెప్పడం జరిగింది.

అయితే వారెవరూ కూడా చేయడానికి ధైర్యం చేయలేదు. ఫైనల్ గా వైష్ణవి ఒప్పుకుందని సాయి రాజేష్ క్లారిటీ ఇచ్చారు. అలా నిజజీవితంలో జరిగిన ఒక సంఘటన నుంచి స్ఫూర్తి పొంది బేబీ చిత్రాన్ని తెరకెక్కించినట్లు దర్శకుడు చెప్పుకొచ్చారు. అయితే ఒరిజినల్ కథలో ఉన్నట్లు అమ్మాయిని చంపేస్తే ఆడియన్స్ కి తప్పుడు మెసేజ్ ఇచ్చినట్లు అవుతుందని భావించి క్లైమాక్స్ మాత్రం మార్చడం జరిగిందని చెప్పారు.