డిజాస్టర్ డైరెక్టర్.. నాగ్ తో ప్లానింగ్?

కింగ్ నాగార్జున గత కొంతకాలంగా వరుస డిజాస్టర్ లతో సతమతం అవుతున్నారు. అక్కినేని ఫ్యామిలీకి సరైన సక్సెస్ ఈ మధ్యకాలంలో పడలేదు. అయితే నెక్స్ట్ మాత్రం సాలిడ్ హిట్ ని అందుకోవాలని నాగార్జున గట్టి ఆలోచనతో ఉన్నారు. అందుకు తగ్గట్లుగానే పక్కా ప్లాన్ చేసుకుంటున్నారు. ప్రసన్న కుమార్ బెజవాడ దర్శకత్వంలో మూవీ చేయాలని అనుకున్నారు. అయితే అది ఎందుకనో ఆగిపోయినట్లు టాక్ వినిపిస్తోంది.

అయితే ఇప్పుడు నాగార్జున లైన్ లోకి మరో టాలెంటెడ్ డైరెక్టర్ వచ్చి చేరినట్లు తెలుస్తోంది. ఆర్ఎక్స్ 100 మూవీతో సూపర్ సక్సెస్ అందుకున్న అజయ్ భూపతి నెక్స్ట్ మహా సముద్రం అనే సినిమాతో డిజాస్టర్ ఖాతాలో వేసుకున్నారు. అయితే ఇప్పుడు మంగళవారం అనే హర్రర్ జోనర్ లో మూవీ చేస్తున్నాడు. ఈ సినిమాలో పాయల్ రాజ్ పుత్ లీడ్ రోల్ లో నటిస్తోంది.

ఈ మూవీ తర్వాత అజయ్ భూపతి కింగ్ నాగార్జునతో సినిమా చేయడానికి ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ఇప్పటికే స్టొరీ డిస్కషన్ కూడా జరిగిపోయిందంట. శ్రీనివాస్ చిట్టూరి ఈ సినిమాని అన్నపూర్ణ స్టూడియోస్ తో కలిసి నిర్మించనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ మూవీ కాన్సెప్ట్ ఏంటి, ఇతర క్యాస్టింగ్ ఎవరనేది క్లారిటీ అయితే ఇంకా రాలేదు.

త్వరలో ఈ సినిమాని అఫీషియల్ గా ఎనౌన్స్ చేయనున్నరంట. మంగళవారం మూవీ షూటింగ్ కంప్లీట్ చేసుకొని అజయ్ భూపతి రిలీజ్ కి రెడీ చేస్తున్నాడు. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత కింగ్ నాగార్జున మూవీని అజయ్ భూపతి స్టార్ట్ చేయనున్నట్లు ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తోంది. మేగ్జిమమ్ యాక్షన్ బ్యాక్ డ్రాప్ లోనే ఈ చిత్రం ఉండే ఛాన్స్ ఉందని తెలుస్తోంది.

గత ఏడాది ది ఘోస్ట్ మూవీతో కింగ్ నాగార్జున డిజాస్టర్ ఖాతాలో వేసుకున్నారు. ఈ నేపథ్యంలో పెర్ఫెక్ట్ స్క్రిప్ట్ నెక్స్ట్ సినిమా చేయాలని భావించి ఎనిమిది నెలల గ్యాప్ తీసుకున్నట్లు తెలుస్తోంది. మరి అజయ్ భూపతి నాగార్జున మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యే రేంజ్ లో సాలిడ్ సక్సెస్ ఇస్తారేమో చూడాలి.