బాబు ఫ్యాన్స్ ని కన్ఫ్యూజన్ చేస్తున్న త్రివిక్రమ్

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం జరుగుతుంది. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కబోయే ఈ మూవీలో పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్స్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక గుంటూరు బ్యాక్ డ్రాప్ లో ఈ మూవీ కథాంశం ఉండబోతుంది అని తెలుస్తుంది. ఇక మహేష్ బాబు ఈ సినిమాలో లైట్ గా గెడ్డంతో కనిపిస్తాడు అని తాజాగా బయటకి వచ్చిన లుక్స్ బట్టి తెలుస్తుంది.

ఈ మూవీలో మలయాళీ స్టార్ జయరామ్ కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే ఈ మూవీ బిజినెస్ ఇప్పటికే పూర్తయినట్లు టాక్ వినిపిస్తుంది. ఇక మార్చి 22న ఉగాది సందర్భంగా ఈ మూవీ నుంచి ఇంటరెస్టింగ్ అప్డేట్ ఉంటుందని ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. ఇక ఆ అప్డేట్ కోసం సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ ని ఉగాదిని రిలీజ్ చేసే అవకాశం ఉందనే మాట వినిపిస్తుంది.

ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమాగురించి మరో ఇంటరెస్టింగ్ అప్డేట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. సూపర్ స్టార్, త్రివిక్రమ్ సినిమా ఆగష్టు 10న రిలీజ్ అవుతుందని అని గతంలో నిర్మాత నాగ వంశీ ప్రకటించాడు. అయితే అఫీషియల్ గా మాత్రం డేట్ కన్ఫర్మ్ చేయలేదు. అయితే ఇప్పుడు ఈ మూవీ డేట్ మారే అవకాశాలు ఉన్నాయంట. ప్రస్తుతం షూటింగ్ వేగంగా జరుగుతున్నా కూడా ఆగష్టు నాటికి రిలీజ్ చేయడం కష్టం అవ్వొచ్చనే టాక్ వినిపిస్తుంది.

ఈ నేపధ్యంలో మూవీ రిలీజ్ కోసం మరో డేట్ ని ఫిక్స్ చేయాలని భావిస్తున్నట్లు బోగట్టా. ఆ డేట్ కూడా ఉగాది రోజు ఎనౌన్స్ చేసే ఛాన్స్ ఉందంట. అయితే రిలీజ్ డేట్ విషయంలో ఇప్పుడు వినిపిస్తున్న మాట సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ ని కథా కన్ఫ్యూజన్ లో పడేసింది అనే మాట సోషల్ మీడియాలో వినిపిస్తుంది.