SS Rajamouli: దేశ పౌరులకు రాజమౌళి సూచన: బాధ్యతగా ఉంటేనే దేశ రక్షణ

దేశం ఆందోళనకర పరిస్థితుల్లో ఉన్న సమయంలో, ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి పౌరులందరికీ ముఖ్యమైన సందేశం ఇచ్చారు. భద్రతకు సంబంధించిన విషయాల్లో ఒక్కొక్కరూ బాధ్యతగా ప్రవర్తించాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు. ముఖ్యంగా, సైనిక దళాల కదలికలు గమనించినప్పుడు వాటిని ఫోటోలు తీయడం, వీడియోలు తీసి షేర్ చేయడం పూర్తిగా తప్పు అని రాజమౌళి పేర్కొన్నారు.

అటువంటి పనులు దేశ శత్రువులకు అనుకోకుండా సహాయం చేసినట్టే అవుతాయని హెచ్చరించారు. సమాజంలో కల్తీ వార్తలు, ధృవీకరించని సమాచారం వేగంగా వ్యాపిస్తున్న వేళ, సామాజిక మాధ్యమాల వాడకంలో జాగ్రత్తలు అవసరమని ఆయన చెప్పారు. ఎక్కడైనా విన్న వార్తను చెక్ చేయకుండా షేర్ చేయడం వల్ల ఆందోళనలు ఏర్పడతాయని, ఇది శత్రువులకే మేలు చేస్తుందన్నారు. ఒక బాధ్యతాయుత పౌరుడిగా ప్రవర్తించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఆయన గుర్తు చేశారు.

ప్రస్తుత పరిస్థితుల్లో పౌరులు ఆత్మవిశ్వాసం కోల్పోకుండా, ప్రశాంతంగా ఉండాలని రాజమౌళి పిలుపునిచ్చారు. మన సైనిక దళాలు ధైర్యంగా పోరాడుతున్నాయి, ఆత్మవిశ్వాసంతో కలసి నిలబడితే మనం గెలుస్తామన్నది ఆయన విశ్వాసం. “శాంతంగా, అప్రమత్తంగా ఉండండి… మనదే విజయం” అంటూ తన సందేశాన్ని ముగించారు.

“ఉగ్రవాదం నుంచి మన దేశాన్ని కాపాడుతున్న సైనికుల శౌర్యానికి వందనం. మనం స్ఫూర్తి పొందాలి, ఒక దేశంలా ఐక్యంగా నిలబడాలి. అలా చేసినప్పుడే శాంతి, భద్రతతో కూడిన భవిష్యత్తు సాధ్యమవుతుంది” అని రాజమౌళి మరో ట్వీట్‌లో పేర్కొన్నారు. సోషల్ మీడియాలో ఈ సూచనలు విస్తృతంగా చర్చకు దారితీస్తున్నాయి.

Movie On Opearation Sindoor Title ? | Ind vs Pak War 2025 | Latest Updates | Telugu Rajyam