‘గేమ్‌ ఛేంజర్‌’ను త్వరగా పూర్తి చేస్తా: శంకర్‌

రామ్‌చరణ్‌-శంకర్‌ల కాంబోలో తెరకెక్కుతోన్న సినిమా ‘గేమ్‌ ఛేంజర్‌’ చిత్రం నుంచి అప్‌డేట్‌ వచ్చి చాలా రోజులవుతోంది. తాజాగా దర్శకుడు శంకర్‌ దీనిపై అప్‌డేట్‌ ఇచ్చారు.’ఇండియన్‌ 2’ ప్రమోషన్‌లో భాగంగా ఇచ్చిన ఇంటర్య్వూలో ‘గేమ్‌ ఛేంజర్‌’ గురించి మాట్లాడారు. సినిమా షూటింగ్‌ దాదాపు పూర్తయింది. ఇంకా 10 రోజుల చిత్రీకరణ మాత్రమే మిగిలి ఉంది. ‘ఇండియన్‌ 2’ రిలీజ్‌ కాగానే ‘గేమ్‌ ఛేంజర్‌’ ప్రొడక్షన్‌ పనులు పూర్తి చేస్తాను. ఆ తర్వాత ఫైనల్‌ ఫుటేజ్‌ చూసి పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు ప్రారంభిస్తాను. అన్ని పనులు పూర్తయిన తర్వాత రిలీజ్‌పై ఓ నిర్ణయం తీసుకుంటా. సాధ్యమైనంతవరకు త్వరగానే రిలీజ్‌ చేయడానికి ప్రయత్నిస్తా’ అని శంకర్‌ చెప్పారు.

అలాగే హీరో సిద్దార్థ్‌ మాట్లాడుతూ.. శంకర్‌ ఓ సినిమాలో 2000 మందితో సన్నివేశాలు చిత్రీకరించారు. అవి అద్భుతంగా ఉన్నాయని అన్నారు. దీంతో సిద్దార్థ్‌ చెప్పింది ‘గేమ్‌ ఛేంజర్‌’ గురించేనని రామ్‌చరణ్‌ అభిమానులు భావిస్తున్నారు. ఇక ఈ సినిమా విషయానికొస్తే.. పొలిటికల్‌, యాక్షన్‌ నేపథ్యంలో సాగే పవర్‌ఫుల్‌ కథాంశంతో సిద్ధమవుతోంది. ఇందులో రామ్‌ చరణ్‌ ద్విపాత్రాభినయంలో కనిపించనున్నట్లు సమాచారం. కియారా అడ్వాణీ హీరోయిన్‌గా కనిపించనుండగా.. అంజలి, శ్రీకాంత్‌, సునీల్‌, ఎస్‌.జె.సూర్య, సముద్రఖని, నవీన్‌ చంద్ర తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు.