మిస్టర్‌ బచ్చన్‌ సినిమా అందరూ మెచ్చేలా ఉంది: సోషల్‌ విూడియా విమర్శలను పట్టించుకోను

దర్శకుడు హరీశ్‌ శంకర్‌ ’మిస్టర్‌ బచ్చన్‌’ సినిమాకు వచ్చిన టాక్‌పై స్పందించారు. సినిమాలో మంచిని పట్టించుకోకుండా, ఒక్క పాయింట్‌ను ఆధారంగా విమర్శించడం కరెక్ట్‌ కాదన్నారు. అలాంటి వారినీ, ఆ విమర్శలను పట్టించుకోవలసిన అవసరం లేదన్నారు. ’సోషల్‌ విూడియాలో ట్రోల్స్‌ నాకు కొత్తేవిూ కాదు. అలానే సోషల్‌ విూడియా మాత్రమే నా జీవితం కాదు. నేను ఆకాశం లాంటి వాడిని. ఉరుము వచ్చినా.. పిడుగు వచ్చినా ఇలానే ఉంటా. నా వ్యక్తిత్వం అలాంటిది అన్నారు.

’గతంలో రవితేజ నటించిన కొన్ని సినిమాలకు వచ్చిన స్పందనలు నన్ను నిరాశపరిచాయి. కానీ, ఆ దర్శకుల విూద లేని అటాక్‌ నాపై జరిగింది. కొందరు ఉద్దేశపూర్వకంగానే నన్ను టాª`గ్గంªట్‌ చేసి నెగెటివ్‌గా ప్రచారం చేస్తున్నారు. ఇందులోని ఒక డ్యాన్స్‌ మూమెంట్‌ను ప్రధానంగా తీసుకుని విమర్శిస్తున్నారు. కానీ, ఇందులో మంచి డైలాగులు చాలా ఉన్నాయి. వాటిని పట్టించుకోవడం లేదు. ’కట్నం తీసుకొని కాపురం చేసే మగవాడు వ్యభిచారం చేసినట్లు లెక్క’ అని రాశాను. దాన్ని పక్కన పెట్టేశారు. ఆ డైలాగు అమ్మాయిలకు చాలా నచ్చిందని నాకు ఫోన్‌ చేసి చెప్పారు. అలాగే హీరో ఓ సందర్భంలో హీరోయిన్‌తో ’నీకు నా ప్రేమ అర్థమయ్యేవరకు నిన్ను కదిలించను’ అంటాడు. అమ్మాయిలు ఏ విషయంలోనైనా ’నో’ చెబితే వాళ్ల నిర్ణయాన్ని గౌరవించాలనే ఉద్దేశంతో ఆ డైలాగు రాశాను. దీని గురించి కూడా ఎవరూ మాట్లాడలేదు. మంచిని పక్కనబెట్టి వాళ్లకు సౌలభ్యంగా ఉన్న వాటిని తీసుకుని విమర్శించే వాళ్లను పట్టించుకోవాల్సిన అవసరం లేదు’ అని అన్నారు.

వాటిలో ఉన్న కామన్‌ పాయింట్స్‌ నోట్‌ చేసుకున్నా. ఈ సినిమాపై అందరూ రాసిన రివ్యూలు చదివాను. సినిమా ఎలాఉందనే దానిపై మొదటిరోజే నిర్ణయం తీసుకోవడం సరైన పద్ధతేనా? సినిమా ఎలా ఉందని టీజర్‌, ట్రైలర్‌, పాటల ఆధారంగా ప్రేక్షకులు ఓ నిర్ణయానికి వస్తారు. జిక్కీ పాటలో లిరిక్స్‌ ఎంతోమంది ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు. సినిమా కోసం టికెట్‌ కొని వచ్చిన ప్రతిఒక్కరి నిర్ణయాన్ని నేను గౌరవిస్తాను అన్నారు.