అతనితో కలిసి డింపుల్ హయాతి ప్రత్యేక పూజలు..

సెలబ్రిటీ ఆస్ట్రాలజర్ గా టాలీవుడ్ లో వేణు స్వామికి గుర్తింపు ఉన్న సంగతి తెలిసిందే. రెగ్యులర్ గా యూట్యూబ్ ఛానల్స్ లో ఇంటర్వ్యూస్ ఇస్తూ వేణు స్వామి తన పాపులారిటీ పెంచుకున్నారు. ఎక్కువగా సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు సంబంధించిన జాతకాలను మీడియాతో పంచుకుంటూ సోషల్ మీడియాలో ప్రముఖ ఆస్ట్రాలజర్ ఫేమ్ క్రియేట్ చేసుకున్నారు.

ఇక వేణు స్వామి దగ్గర చాలామంది టాలీవుడ్ హీరోయిన్స్ ప్రత్యేకంగా దోష నివారణ పూజలు చేస్తూ ఉంటారు. అలా పూజలు చేసుకున్న తర్వాత సదరు హీరోయిన్స్ పాపులర్ అయ్యారని కూడా వేణు స్వామి తన ఇంటర్వ్యూలలో చెప్పుకోవడం చాలా సందర్భాలలో చూశాం. రష్మిక మందన మొదటిసారి వేణు స్వామి దగ్గర ప్రత్యేక పూజలు చేయించుకున్నారు.

తర్వాత కృతి శెట్టి, నిధి అగర్వాల్ కూడా ఆయనతో ప్రత్యేక హోమం, పూజలు వంటివి దోష నివారణ కోసం చేయించుకోవడం జరిగింది. వాటికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తాజాగా మరో టాలీవుడ్ గ్లామర్ హీరోయిన్ వేణు స్వామితో ప్రత్యేక పూజలు చేయించుకోవడం విశేషం.

ఖిలాడి, రామబాణం సినిమాలలో హీరోయిన్ గా నటించిన డింపుల్ హయాతి వేణు స్వామి దగ్గర ప్రత్యేక పూజలు చేయించుకుని అతని ఆశీర్వాదం చేసుకున్నారు. ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. డింపుల్ హయాతి హీరోయిన్ గా ఇప్పటికే చాలా సినిమాలు చేసిన స్టార్ స్టేటస్ ని అందుకోలేకపోతుంది. అందాల ప్రదర్శనలో కూడా ఎలాంటి హద్దులు పెట్టుకోకుండా సినిమాలలో గ్లామర్ షో చేస్తున్న ఈమెకు సరైన బ్రేక్ మాత్రం పడలేదని చెప్పాలి.

ఈ నేపథ్యంలోనే వేణు స్వామితో ప్రత్యేకంగా దోస నివారణ పూజలు చేయించుకున్నట్లుగా టాలీవుడ్ వర్గాలలో వినిపిస్తోంది. ఏది ఏమైనా టాలీవుడ్ హీరోయిన్స్ వరుసగా వేణు స్వామితో పూజలు చేయించుకోవడం ఇప్పుడు ఇండస్ట్రీ సర్కిల్లో హాట్ టాపిక్ గా మారింది. కొద్ది రోజుల క్రితం రామ్ చరణ్, ఉపాసన కూతురు జాతకం చెప్పి సోషల్ మీడియాలో వైరల్ గా వేణుస్వామి మారిపోయారు.