నాని భారీ సినిమాతో దిల్ రాజు మస్త్ బిజినెస్.!

టాలీవుడ్ లో ఉన్న మోస్ట్ ఇంటెలిజెంట్ ప్రొడ్యూసర్స్ లో దర్శకుడు దిల్ రాజు కూడా ఒకరు. మరి దిల్ రాజు రీసెంట్ గా ప్రొడ్యూస్ చేసిన సినిమా వారిసు తో అయితే 300 కోట్ల పైగా వసూళ్లు తాను అందుకొని తన బ్యానర్ లో మరో సెన్సేషనల్ హిట్ ని కొట్టారు. అయితే దిల్ రాజు ఒక్క ప్రొడ్యూసర్ గానే కాకుండా డిస్ట్రిబ్యూటర్ గా కూడా చాలా మందికి తెలుసు.

కాగా రెండు పక్కలా తాను నిర్మాతగా మరియు డిస్ట్రిబ్యూటర్ గా కూడా చేస్తున్నారు. మరి అలా తాను లేటెస్ట్ గా నేచురల్ స్టార్ నాని నటించితిన్ భారీ పాన్ ఇండియా సినిమా “దసరా” తో మస్త్ బిజినెస్ చేస్తున్నట్టుగా సినీ వర్గాలు చెప్తున్నాయి. నిజానికి దసరా సినిమా హక్కులు ముందు పలువురు డిస్ట్రిబ్యూటర్స్ మంచి ధరతో కొనుక్కున్నారు.

కానీ మాస్టర్ మైండ్ దిల్ రాజు సినిమా హైప్ ని ముందే ఊహించి వారి దగ్గర నుంచి అప్పుడే ఆ హక్కులు కొంచెం ఎక్కువ ధర ఇచ్చి కొనేసి ఇప్పుడు సినిమాకి పెరిగిన డిమాండ్ తో అంతకు మించిన ఫిగర్స్ తో డిస్ట్రిబ్యూట్ చేస్తున్నట్టుగా గాసిప్స్ వినిపిస్తున్నాయి.

దీనితో దిల్ రాజు మాత్రం మామూలోడు కాదని మరోసారి ట్రేడ్ వర్గాలు వారు మాట్లాడుకుంటున్నారు. కాగా నాని సినిమాకి దర్శకుడు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించగా కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించింది. అలాగే ఈ మార్చ్ 30న గ్రాండ్ గా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కాబోతుంది.