పదేళ్ల తరువాత బొమ్మరిల్లు కాంబో.. 

dil raju

టాలీవుడ్ ఇండస్ట్రీలో అతి తక్కువ బడ్జెట్ లో వచ్చి బిగ్గెస్ట్ బాక్సాఫీస్ హిట్ గా నిలిచిన చిత్రాల్లో బొమ్మరిల్లు ఒకటి. ఆ సినిమా అందించిన కలెక్షన్స్ తో దిల్ రాజు ఒక్కసారిగా అగ్ర నిర్మాతల జాబితాలోకి చేరిపోయాడు. ఆ తరువాత మున్నా, పరుగు అంటూ పెద్ద బడ్జెట్ సినిమాలను నిర్మించడం స్టార్ట్ చేశాడు. ఇక సిద్దార్థ్ కూడా ఆ సినిమాతోనే తెలుగు  ఆడియెన్స్ కు మరింత దగ్గరయ్యాడు. 

bommarillu

ఇప్పటివరకు సిద్దార్థ్ అలాంటి మంచి సక్సెస్ ను అందుకోలేదు. ఇకపోతే చాలా రోజుల తరువాత ఈ కాంబినేష్ కు సంబందించిన ఒక గాసిప్ వైరల్ గా మారింది. దిల్ రాజు మళ్ళీ సిద్దార్థ్ తో కలిసి సినిమా చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. చివరగా వీరి కాంబినేషన్ లో ఓ మై ఫ్రెండ్ సినిమా వచ్చింది. ఆ సినిమా అంతగా సక్సెస్ అవ్వలేదు. ఇక వచ్చే ఏడాది దిల్ రాజు సిద్దార్థ్ సినిమా పట్టాలెక్కనుందని టాక్. 

ఇక దర్శకుడు ఎవరంటే.. ఉయ్యాలా జంపాల, మజ్ను సినిమాలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న యువ దర్శకుడు విరించి వర్మ తెరకెక్కించే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. దిల్ రాజు ప్రొడక్షన్ లో ఈ దర్శకుడు ఎప్పటి నుంచో ఒక సినిమా చేయాలనీ అనుకుంటున్నాడు. ఇక ఇటీవల ఒక లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ కథ రావడంతో దిల్ రాజు సిద్దార్థ్ ను ఫిక్స్ చేసినట్లు టాక్.