“శాకుంతలం” రిజల్ట్ పై దిల్ రాజు షాకింగ్ స్టేట్మెంట్.!

dilraju04082022_c

ఈ ఏడాది టాలీవుడ్ సినిమా దగ్గర వచ్చిన లేటెస్ట్ చిత్రాల్లో మంచి అంచనాలు బజ్ క్రియేట్ చేసిన వచ్చిన సినిమాల్లో ఒకటి “శాకుంతలం”. స్టార్ హీరోయిన్ సమంత మెయిన్ లీడ్ లో దేవ్ మోహన్ హీరోగా నటించిన ఈ పీరియాడిక్ చిత్రాన్ని దర్శకుడు గుణశేఖర్ తెరకెక్కించారు.

మరి ఈ సినిమా మొదటి రెండు రోజులకే బాక్సాఫీస్ దగ్గర తేలిపోయింది. దీనితో భారీ నష్టాలు ఖాయం అని అంతా ఫిక్స్ అయ్యిపోయారు. ఓవర్సీస్ నుంచి కూడా ఓ మాదిరి వసూళ్లు వచ్చాయి కానీ ఇక వీక్ డేస్ లోకి వచ్చాక అయితే అంతా ఆవిరి అయ్యిపోయాయి.

మరి ఈ సినిమాకి నిర్మాతగా చేసిన దిల్ రాజు ముందే ప్రిపేర్ అయ్యారో లేదో కానీ లేటెస్ట్ గా ఇచ్చిన ఓ స్టేట్మెంట్ వైరల్ గా మారుతుంది. ఈ సినిమాకి సోమవారం నుంచే అసలు వసూళ్లు ఆగిపోయాయి అని తమ సినిమాలు సోమవారం ఫ్లో లేదు అంటే ఒక మేము ఫిక్స్ అయ్యాయిపోవాలని తన 25 ఏళ్ల కెరీర్ లోనే శాకుంతలం చిత్రం పెద్ద జర్క్ ఇచ్చింది అని తెలిపారు.

దీనితో ఏకంగా తన 25 ఏళ్ళు కెరీర్ లోనే ఓ సినిమా ఇలాంటి ఫలితం ఇచ్చింది అని స్టేట్మెంట్ ఇచ్చారు అంటే ఈ సినిమా ఏ రేంజ్ ప్లాప్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. కాగా ఈ సినిమాకి మణిశర్మ సంగీతం అందించగా అల్లు అర్హ సినిమాలో కీలక పాత్ర పోషించింది.