శకుంతలం దెబ్బపై దిల్ రాజు కామెంట్

టాలీవుడ్ లో మోస్ట్ సక్సెస్ఫుల్ ప్రోడ్యుసర్గా తనకంటూ ప్రత్యేకమైన బ్రాండ్ క్రియేట్ చేసుకున్న వ్యక్తి దిల్ రాజు. నిర్మాతగా 10 ఏళ్ల ప్రస్థానాన్ని ఆయన పూర్తి చేసుకున్నారు. కానీ సినిమా రంగంలోకి అడుగుపెట్టి పాతికేళ్లకి పైగా అయింది. ఆడియో క్యాసెట్స్ వ్యాపారం నుంచి మొదలు పెట్టి తర్వాత బయ్యర్ గా, డిస్ట్రిబ్యూటర్ గా నిర్మాతగా తన ప్రస్థానాన్ని పెంచుకుంటూ వెళ్లారు.

సుదీర్ఘ ప్రయాణంలో నిర్మాతగా తెలుగు ప్రేక్షకులకి గుర్తిండిపోయే ఎన్నో అద్భుత సినిమాలను అందించారు. ఆయన కెరియర్ లో కూడా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ అవుతాయి అనుకున్న చిత్రాలతో డిజాస్టర్లు సొంతం చేసుకున్నారు. భారీ నష్టాలు కూడా చవి చూశారు. అయిన కూడా నిర్మాతగా బలంగా నిలబడ్డారు. ఇదిలా ఉంటే తాజాగా తన సినిమా ప్రస్థానానికి సంబంధించిన ప్రయాణాన్ని యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పంచుకున్నారు.

ఈ సందర్భంగా ఈ ఏడాది బలగం సినిమా నిర్మాతగా ఎంత సంతృప్తి ఇచ్చిందని చెప్పారు. అలాగే డిస్ట్రిబ్యూటర్ గా దసరా సినిమాతో వచ్చిన లాభాల గురించి పంచుకున్నారు. అయితే గుణశేఖర్ దర్శకత్వంలో సమంత లీడ్ రోల్ లో వచ్చిన శాకుంతలం సినిమా గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. తన 25 ఏళ్ల కెరియర్ లో అతి పెద్ద దెబ్బ శకుంతలం సినిమాతో తగిలిందని పేర్కొన్నారు.

అయితే అది ఎలాంటిది. ఏ విధంగా తాను నష్టపోయినది కూడా ఆ ఇంటర్వ్యూలో దిల్ రాజు పంచుకున్నట్టు తెలుస్తుంది. దానికి సంబంధించిన ప్రోమో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. శాకుంతలం సినిమా కథ నచ్చి నిర్మాత దిల్ రాజు మధ్యలో సమర్పకుడుగా సగానికి పైగా బడ్జెట్ పెట్టారు.

రిలీజ్ తర్వాత ఈ మూవీ డిజాస్టర్ టాక్ సొంతం చేసుకుని రెండో రోజే థియేటర్స్ ఖాళీ అయిపోయింది. పెట్టిన పెట్టుబడిలో మెజారిటీ శాకుంతలం కారణంగా ఇటు గుణశేఖర్ అటు దిల్ రాజు నష్టపోయారు అని చెప్పాలి. మరి ఏ స్థాయిలో నష్టం జరిగింది అనేది దిల్ రాజుకు సంబంధించిన పూర్తి ఇంటర్వ్యూ వస్తే తెలిసే అవకాశం ఉంది.