దిల్‌ రాజుకు నాని ‘సరిపోదా శనివారం’ సినిమా డిస్ట్రిబ్యూషన్ హక్కులు!

నాని నటిస్తున్న’సరిపోదా శనివారం’ షూటింగ్‌ జరుగుతోంది. వివేక్‌ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ప్రియాంక మోహన్‌ కథానాయికగా నటిస్తోంది. ఇందులో ప్రముఖ తమిళ నటుడు ఎస్‌.జె. సూర్య విలన్‌ పాత్రలో కనపడతారు. డీవీవీ దానయ్య నిర్మాత.

ఈ సినిమా గురించి ఒక ముఖ్యమైన వార్త విడుదల చేశారు. ప్రముఖ నిర్మాత దిల్‌ రాజు, అతని సోదరుడు శిరీష్‌ నిర్మాణ సంస్థ అయిన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ ఈ ‘సరిపోదా శనివారం’ సినిమా ఆంధ్ర ప్రదేశ్‌, తెలంగాణ రాష్టాల్ర డిస్ట్రిబ్యూషన్ హక్కులు! తీసుకున్నట్టుగా సామజిక మాధ్యమం వేదికగా ప్రకటించింది.

ఈ ప్రకటన ఆసక్తికరంగా మారింది. ఇలా సినిమా నిర్మాణంలో ఉండగానే థియేటర్‌ హక్కులు కొనుక్కోవటం పరిశ్రమలో ఒక చర్చగా నడుస్తోంది. ఈ సినిమా మీద ఇప్పటికే క్రేజ్‌ ఉన్నప్పటికీ, దిల్‌ రాజు ఇలా థియేటర్‌ హక్కులు తీసుకోవటంతో మరింత ఆసక్తికరంగా మారిందని అంటున్నారు.