ఔనా.? తారకరత్నని వాళ్ళెవరూ పట్టించుకోలేదా.?

తారకరత్నకు గుండె పోటు వచ్చాక.. అన్నీ తానే అయి వ్యవహరించారు బాబాయ్ బాలకృష్ణ. బెంగళూరు నారాయణ హృదయాలయకు కుప్పం నుంచి తరలించడం మాత్రమే కాదు, విదేశీ వైద్యుల్ని రప్పించి.. తారకరత్నకు వైద్య చికిత్స అందేలా చేసింది కూడా బాలకృష్ణే. నిజమే.! తారకరత్న ఆసుపత్రిలో వున్నప్పుడు, అక్కడ బాలయ్యను చూసినవారెవరైనా.. అబ్బాయ్ ప్రాణాల్ని నిలబెట్టడానికి బాబాయ్ పడిన తాపత్రయాన్ని మర్చిపోలేరు.

కానీ, అసలు తారకరత్న పెళ్ళి చేసుకున్నాక.. కుటుంబానికి ఎందుకు దూరమయ్యాడు.? ఆ సమయంలో ఆయన్ని కుటుంబ సభ్యులెవరూ ఎందుకు పట్టించుకోలేదు.? ఈ ప్రశ్నలిప్పుడు తెరపైకొస్తున్నాయి.

‘అప్పట్లో తారకరత్న మొహం కూడా చూడకూడదనుకున్నవాళ్ళు.. ఇప్పుడు ఆయన పార్దీవ దేహానికి నివాళులర్పిస్తున్నారు..’ అన్న చర్చ జరుగుతోంది. అందులో కుటుంబ సభ్యుల పేర్లే ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఇదంతా నిజమేనా.? ఏమో, పెద్ద పెద్ద కుటుంబాల్లోనూ ‘ఇరుకు’ మనస్సులుంటాయ్.!