చిరంజీవికి కాజల్ నో చెప్పిందా.?

చిరంజీవి 156వ చిత్రంగా రూపొందుతోన్న సినిమాకి సంబంధించి రోజుకో గాసిప్ చక్కర్లు కొడుతోంది. ఈ సినిమా రీసెంట్‌గా స్టార్ట్ అయిన సంగతి తెలిసిందే. ‘విశ్వంభర’ అంటూ సినిమాకి వర్కింగ్ టైటిల్ కూడా వినిపిస్తోంది.

ఇక, తాజాగా ఈ సినిమాకి సంబంధించి మరో కొత్త ప్రచారం తెర పైకి వచ్చింది. ఈ సినిమాలో ముగ్గురు వరకూ సీనియర్ హీరోయిన్లు నటించబోతున్నారట.. అంటూ ప్రచారం జరుగుతోన్న సంగతి తెలిసిందే.

వారిలో త్రిష, నయన తార, కాజల్ అగర్వాల్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయ్. తాజాగా కాజల్ అగర్వాల్‌తో సంప్రదింపులు జరిపారట చిత్ర యూనిట్. అందుకు కాజల్ నో అనేసిందని గుస గుసలు వినిపిస్తున్నాయ్.

‘ఆచార్య’ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా ఎంపిక చేసుకోగా.. కొంత భాగం షూటింగ్ తర్వాత ఆమెని తప్పించేశారు. మొదట ఈ సినిమాలో త్రిషను అనుకున్నారు కానీ, కాజల్‌ని తీసుకున్నారు.

చివరికి కొంత భాగం షూటింగ్ తర్వాత కాజల్‌ని లేపేయడంతో ఆమె హర్ట్ అయ్యింది.. అందుకే ఇప్పుడు మళ్లీ అడిగితే నో చెప్పేసిందంటూ ప్రచారం జోరుగా వినిపిస్తోంది.

ఇదే విషయం కాజల్ వద్ద ప్రస్థావిస్తే.. అలాంటి ప్రతిపాదన ఏదీ తన వద్దకు రాలేదని క్లారిటీ ఇచ్చేసిందట కాజల్. అంతేకాదు, ‘ఆచార్య’ సినిమా తర్వాత కాజల్, చిరంజీవిని కలిసింది కూడా. వారి మధ్య ఎలాంటి అభిప్రాయ బేధాలు లేవన్నది నిక్కర్చయిన నిజం.

ఇక ‘ఆచార్య’ నుంచి కాజల్‌ని తొలిగించిన విషయానికి వస్తే.. అది పూర్తిగా సెటిల్‌మెంట్ యవ్వారమే. చిరంజీవి చొరవతో కాజల్‌కి పూర్తి అమౌంట్ ముట్టచెప్పేశారు కూడా. సో, ఇక్కడ కాజల్ నో చెప్పడానికేముంది ఇందులో.!